ETV Bharat / bharat

చెరువులోకి దూసుకెళ్లిన టాక్టర్- 24మంది యాత్రికులు మృతి

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 24, 2024, 12:53 PM IST

Updated : Feb 24, 2024, 5:16 PM IST

Uttar Pradesh Accident Today
Uttar Pradesh Accident Today

Uttar Pradesh Accident Today : ఉత్తర్​ప్రదేశ్​లో ఘోర ప్రమాదం జరిగింది.​ చెరువులో ట్రాక్టర్​ పడి 24 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. మృతుల్లో 8 చిన్నారులు, 13 మంది మహిళలు ఉన్నారు.

Uttar Pradesh Accident Today : ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిన ఘోర ప్రమాదంలో 24 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. మృతుల్లో 8 చిన్నారులు, 13 మంది మహిళలు ఉన్నారు. యాత్రికులను తీసుకెళ్తున్న ఒక ట్రాక్టర్ చెరువులో పడిపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. యాత్రికులంతా హరిద్వార్‌ వెళ్తుండగా కాస్‌గంజ్‌లో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో గాయపడిన నలుగురు చిన్నారులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ట్రాక్టర్ ట్రాలీలో 35-40 మంది వరకు ఉన్నట్లు సమాచారం.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
మాఘ పూర్ణిమను పురస్కరించుకుని గంగా నదిలో పవిత్ర స్నానమాచరించేందుకు వారంతా హరిద్వార్‌ వెళ్తున్నారు. మార్గమధ్యలో గధయ్య గ్రామ సమీపంలో ట్రాక్టర్‌ అదుపుతప్పి చెరువులో బోల్తాపడింది. అందులో ఉన్న కొంత మంది ఈదుకుంటూ రోడ్డుకు చేరుకుని, స్థానికులను సహాయం కోరారు. వెంటనే స్థానికులు వెంటనే స్పందించి కొంతమందిని కాపాడారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

సీఎం దిగ్భ్రాంతి
ఈ దుర్ఘటనపై ఉత్తర్​ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

అఖిలేశ్​ యాదవ్ సంతాపం
ఈ ప్రమాదం పట్ల ఎస్​పీ అధినేత అఖిలేశ్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సహాయక చర్యలను వేగవంతం చేసి, క్షతగాత్రుల ప్రాణాలను కాపాడాలను అధికారులను కోరారు.

పెళ్లికి వెళ్లొస్తూ 9 మంది మృతి
బిహార్‌లోని లఖీసరాయ్‌ జిల్లాలో బుధవారం (ఫిబ్రవరి 21)న ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో తొమ్మిది మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. ఆటో, లారీ పరస్పరం ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. బాధితులు పెళ్లి వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిందని వెల్లడించారు పోలీసులు. పూర్తి వివరాల కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి.

కాంగ్రెస్, ఆప్​ మధ్య కుదిరిన పొత్తు- పంజాబ్​లో మాత్రం విడివిడిగా పోటీ

ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటు- రంగంలోకి రాహుల్- దీదీని ఒప్పించేందుకు నయా ఫార్ములా!

Last Updated :Feb 24, 2024, 5:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.