ETV Bharat / bharat

కాంగ్రెస్ కంచుకోటలో రాహుల్‌ Vs దినేశ్‌- రాయ్​బరేలీలో హోరాహోరీ తప్పదా? - lok sabha elections 2024

author img

By ETV Bharat Telugu Team

Published : May 3, 2024, 12:48 PM IST

Updated : May 3, 2024, 2:19 PM IST

రాహుల్​ గాంధీ
రాహుల్​ గాంధీ(IANS Photo)

Rahul Gandhi Files Nomination From Raebareli : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాయ్​బరేలీ నుంచి పోటీ చేయడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. రాహుల్​పై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి కూడా బలమైన నేత కావడం వల్ల రాయ్​ బరేలీలో పోటీ హోరాహోరీగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, రాయ్ బరేలీలో రాహుల్ గాంధీ శుక్రవారం నామినేషన్ వేశారు.

Rahul Gandhi Files Nomination From Raebareli : ప్రధాని పీఠం దక్కించుకోవాలంటే ఉత్తర్​ప్రదేశ్​లో ఉన్న 80 లోక్ సభ స్థానాలు చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన తల్లి సోనియా గాంధీ స్థానాన్ని నిలబెట్టుకోవడం, ఉత్తర్ ప్రదేశ్​లో మరిన్ని ఎక్కువ సీట్లు సాధించేందుకు రాయ్​బరేలీ నుంచి పోటీ చేస్తున్నారు. తాజాగా రాహుల్ గాంధీ రాయ్​బరేలీలో నామినేషన్ దాఖలు చేశారు. ఆ సమయంలో రాహుల్ వెంట ఆయన తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ అగ్రనాయకులు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, అశోక్ గహ్లోత్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తదితురులు ఉన్నారు.

రాహుల్​పై బలమైన నేత పోటీ
2019 వరకు కాంగ్రెస్​కు కంచుకోటగా ఉన్న రాయ్​బరేలీ నియోజకవర్గంలో బీజేపీ నుంచి దినేశ్ సింగ్ బరిలో ఉన్నారు. ఆయన కూడా బలమైన నేత. ఈ నేపథ్యంలో రాహుల్​కు రాయ్ బరేలీలో విజయం నల్లేరు మీద నడక కాదని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాహుల్ కు దినేశ్ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కాగా, కేరళలో వయనాడ్ లో పోటీ చేసిన రాహుల్​కు రాయ్ బరేలీలో కఠిన పరీక్ష ఎదురుకానుంది. దశాబ్దాలుగా హస్తం పార్టీకి కంచుకోటగా ఉన్న రాయ్ బరేలీలో రాహుల్ విజయంపై ఆసక్తి నెలకొంది.

కాంగ్రెస్ కు కంచుకోట, ఈ సారి ఏమవుతుందో?
1952 నుంచి రాయ్‌ బరేలీ నియోజకవర్గం గాంధీల కుటుంబానికి 38 ఏళ్లపాటు కంచుకోటగా ఉంది. ఇందిరా గాంధీ, ఆమె భర్త ఫిరోజ్ గాంధీ మొదలుకుని సోనియా గాంధీ వరకు అక్కడ పోటీ చేసి విజయం సాధించారు. సోనియా గాంధీ 2004 నుంచి వరుసగా నాలుగు సార్లు రాయ్​బరేలీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. తాజాగా వ్యక్తిగత కారణాల రీత్యా రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు వెళ్లారు. దీంతో తన ఆ స్థానంలో ఇప్పుడు రాహుల్‌ పోటీ చేస్తున్నారు. 1952-2019 వరకు రాయ్​బరేలీలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ కేవలం మూడు సార్లు మాత్రమే ఓడిపోయింది.

ఒకప్పుడు గాంధీ కుటుంబానికి విధేయుడే ప్రస్తుతం ప్రత్యర్థి
2024 లోక్సభ ఎన్నికల్లో రాయ్​బరేలీ నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న దినేశ్‌ సింగ్‌ 2018 వరకు గాంధీ కుటుంబానికి విధేయుడు. స్థానిక రాజకీయాల్లో ఆయన కుటుంబానికి మంచి పట్టు ఉంది. బ్లాక్‌ చీఫ్‌, జిల్లా పంచాయతీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు ఆయన కుటుంబంలో ఉన్నారు. 2010, 2016లో దినేశ్‌ కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 2018లో హస్తం పార్టీని వీడి బీజేపీలో చేరారు. 2019 లోక్​సభ ఎన్నికల్లో సోనియాపై పోటీ చేసి 1.6 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయినా కాషాయ పార్టీ అగ్ర నాయకత్వం ఆయన్ను ఇప్పటికీ నమ్మడానికి ఓ బలమైన కారణం ఉంది. 2014 ఎన్నికల్లో కమలం పార్టీకి ఇక్కడి నుంచి కేవలం 1.73 లక్షల ఓట్లు మాత్రమే వచ్చాయి. దినేశ్‌ రాకతో ఓట్ల సంఖ్య దాదాపు రెట్టింపుపై 3.67 లక్షలకు చేరింది. 2021లో రాయ్​బరేలీ జిల్లా పరిషత్‌ అధ్యక్ష ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించడానికి దినేశ్ పరపతి, వ్యూహం బాగా ఉపయోగపడ్డాయి. 2024లో సోనియా రాయ్​బరేలీపై తక్కువగా దృష్టి సారించడం వల్ల తమకు గెలుపు సాధ్యమని బీజేపీ భావిస్తోంది. దీంతో ఆయనకు స్థానికంగా పట్టు సడలనీయకుండా ఎమ్మెల్సీ టికెట్‌ ఇచ్చి గెలిపించింది. ఇప్పుడు యోగి కేబినెట్​లో మంత్రిగా పనిచేస్తున్నారు.

సర్వేల పేరుతో ఓటర్ల వివరాలు సేకరించొద్దు- అలా చేస్తే చర్యలు తప్పవ్​ : పార్టీలకు ఈసీ వార్నింగ్​ - Lok Sabha Elections 2024

బంగాల్​​ గవర్నర్​ సీవీ ఆనంద్​ బోస్​పై వేధింపుల ఆరోపణలు- పోలీసులకు మహిళ ఫిర్యాదు - West Bengal Governor Issue

Last Updated :May 3, 2024, 2:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.