తెలంగాణ

telangana

'ఇంకా పెండింగ్‌లో ఉన్న అంశాలు చాలా ఉన్నాయి'

By

Published : Sep 11, 2020, 4:35 PM IST

Updated : Sep 11, 2020, 8:50 PM IST

రాష్ట్రంలో ఎమ్మార్వోలు, ఆర్డీఓల వద్ద నమోదుకాని రికార్డులు అనేకం ఉన్నాయని మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు అన్నారు. ఇంకా పెండింగ్‌లో ఉన్న అంశాలు చాలా ఉన్నాయని పేర్కొన్నారు. వాటిని పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. రాష్ట్ర శాసనసభ సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడారు.

manthani-mla-sridhar-babu-said-there-are-still-a-lot-of-things-pending
'ఇంకా పెండింగ్‌లో ఉన్న అంశాలు చాలా ఉన్నాయి'

'ఇంకా పెండింగ్‌లో ఉన్న అంశాలు చాలా ఉన్నాయి'

నూతన రెవెన్యూ చట్టంలో రికార్డింగ్‌ అథారిటీని తెలపలేదు. వివరాలు నమోదు చేసే అధికారం ఎవరికి ఇచ్చారు అనే విషయం చెప్పలేదు. జాగీర్‌ భూముల అంశాన్ని పరిశీలించాలి. జాగీర్‌ అనే పదానికి ఇప్పటి వరకు నిర్వచనం లేదు. సేల్‌డీడ్‌, గిఫ్ట్​ డీడ్‌, పార్టీషన్‌ డీడ్‌ అంశాలపై స్పష్టత ఇవ్వాలి. ఎటువంటి సమస్యలు లేకుండా ఉండేందుకు ప్రతి అంశంలో స్పష్టత ఇస్తే బాగుంటుంది.

నీడ్స్‌ అండ్‌ బాండ్స్‌ మ్యాప్‌ను కూడా తప్పకుండా పెట్టాలి. ఎమ్మార్వోలు, ఆర్డీఓల వద్ద నమోదుకాని రికార్డులు ఉన్నాయి. ఇంకా పెండింగ్‌లో ఉన్న అంశాలు చాలా ఉన్నాయి. పేర్లు, వివరాల నమోదులో అక్షర దోషాలు ఉంటే ఎవరు సవరించాలనే అంశం తెలపలేదు. సమస్యల పరిష్కారంలో పేదలకు న్యాయ సహాయం అందిస్తే బాగుంటుంది. ఇది హక్కులు ఇచ్చే చట్టం కాదు... వివరాలు నమోదు చేసే చట్టం.

- మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు

ఇదీ చూడండి :కొత్త రెవెన్యూ చట్టంపై సీఎల్పీ నేత భట్టి, సీఎం కేసీఆర్ వాదనలు

Last Updated :Sep 11, 2020, 8:50 PM IST

TAGGED:

ABOUT THE AUTHOR

...view details