కరోనా కారణంగా కళాశాల విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్డౌన్ ఎత్తేసినా విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు తెరుచుకోకపోవడంతో... ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు యువతీ యువకులు డ్రైవింగ్పై ఆసక్తి చూపిస్తున్నారు. గృహిణిలు, ఉద్యోగం చేసే మహిళలు సైతం డ్రైవింగ్ నేర్చుకునేందుకు ముందుకు వస్తున్నారు. పని చేసే ప్రదేశానికి చేరుకునేందుకు ఇన్నాళ్లూ బస్సులు, రైళ్లను ఆశ్రయించిన వారు... ఇప్పుడు వ్యక్తిగత వాహనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఆత్మవిశ్వాసం పెరుగుతుంది..
గతంలో డ్రైవింగ్ నేర్చుకునే వారిలో మహిళల సంఖ్య తక్కువగా ఉండేది. కానీ కరోనా తర్వాత ఆ సంఖ్య రెట్టింపైందని శిక్షకులు చెబుతున్నారు. కరోనా ముందు ఒక బ్యాచ్లో ఒకరు లేదా ఇద్దరు మాత్రమే ఉండేవారని... కానీ ఇప్పుడు ఆ సంఖ్య పెరిగి ఐదు నుంచి ఎనిమిదికి చేరిందని డ్రైవింగ్ స్కూలు నిర్వాహకులు చెబుతున్నారు. డ్రైవింగ్ నేర్చుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందని మహిళలు పేర్కొంటున్నారు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అన్ని డ్రైవింగ్ శిక్షణా సంస్థలు రద్దీగా మారాయి. గతం కంటే ఎక్కువ మంది వస్తుండటంతో ఖాళీ సమయం ఉండటం లేదని శిక్షకులు చెబుతున్నారు.