Semi Christmas Celebrations in Telangana :రాష్ట్రవ్యాప్తంగా సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా చర్చిలను విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబు చేశారు. ప్రభుత్వం తరఫున పేదలకు క్రిస్మస్ కానుకలు (Christmas) అందజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాటలు పాడుతూ ప్రభువును స్మరించుకున్నారు. ప్రముఖులు, రాజకీయవేత్తలు కేకులు కోసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా వైభవంగా సెమీ క్రిస్మస్ వేడుకలు - అందంగా ముస్తాబైన చర్చిలు
ఆసియా ఖండంలో రెండో అతి పెద్ద చర్చిగా పేరుగాంచిన మెదక్ చర్చి క్రిస్మస్ వేడుకలకు సర్వాంగసుందరంగా ముస్తాబైంది. క్రిస్మస్ను పురస్కరించుకుని వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సీఎస్ఐ యంత్రాంగం, స్థానిక ఫాస్టరేట్ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రతి నియోజకవర్గంలో పేదలను గుర్తించి వారికి ప్రత్యేకంగా ప్రభుత్వం తరఫున క్రిస్మస్ కానుకలు అందజేస్తున్నారు.
Ponguleti Distributed Gifts in Khammam District : ఖమ్మం జిల్లా పాలేరులో ప్రభుత్వం తరఫున నిర్వహించిన సెమీ క్రిస్మస్ సంబురాల్లో మంత్రి పొంగులేటి (Ponguleti Srinivas Reddy) శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఆయనను గజమాలతో సత్కరించారు. అనంతరం ర్యాలీగా చర్చికి చేరుకున్నారు. పేదలకు బహుమతులు, దుస్తులు పంపిణీ చేశారు. కేక్ కోసి క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు ప్రేమతో మెలగాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా అన్నారు. మణుగూరులో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలకు హాజరైన ఆమె నిరుపేదలకు దుస్తులు పంపిణీ చేశారు.