తెలంగాణ

telangana

బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలి : రాచకొండ సీపీ

By ETV Bharat Telangana Team

Published : Jan 5, 2024, 7:02 PM IST

Rachakonda CP on Child Labour Awareness : తల్లిదండ్రుల పేదరికం వల్ల పిల్లలు వెట్టి చాకిరీ కోరల్లో చిక్కుకుని తమ బంగారు భవిష్యత్తును కోల్పోతున్నారని రాచకొండ సీపీ సుధీర్​బాబు ఆవేదన వ్యక్తం చేశారు. బాలకార్మిక నిర్మూలనపై నేరేడ్​మెట్​లోని రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో ఆపరేషన్ స్మైల్ సమన్వయ సమావేశం నిర్వహించారు.

Etv Bharat
Rachakonda CP on Child Labour Awareness

Rachakonda CP on Child Labour Awareness : సంతోషంగా చదువుకుంటూ ఆట పాటలతో సాగాల్సిన పిల్లల బాల్యాన్ని చిదిమేస్తున్న బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలని రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్ బాబు(Sudheer babu) అన్నారు. నేరెడ్​మెట్​లోని రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో ఆపరేషన్ స్మైల్ సమన్వయ సమావేశం నిర్వహించారు. అనంతరం ఈ కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ సమాజంలో బాల కార్మిక వ్యవస్థ ఒక వ్యాధిలాగా మారిందని, అది ఎంతో మంది అమాయక పిల్లల బాల్యాన్ని నాశనం చేస్తోందని పేర్కొన్నారు.

గతాన్ని మరచిపోయి కొత్త జీవితానికి ముందడుగు వేయాలి : సీపీ సుధీర్ బాబు

తల్లిదండ్రుల పేదరికం వల్ల పిల్లలు వెట్టి చాకిరీ కోరల్లో చిక్కుకుని తమ బంగారు భవిష్యత్తును కోల్పోతున్నారని రాచకొండ సీపీ(Rachakonda CP) ఆవేదన వ్యక్తంచేశారు. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా, తమ పిల్లలను మాత్రం వెట్టి చాకిరీ కూపంలోకి నెట్టకూడదని, పిల్లల చదువు కోసం ప్రభుత్వం ఉచితంగా ఎన్నో కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సీపీ సూచించారు. వెట్టి చాకిరీ నిర్మూలనలో ప్రజా భాగస్వామ్యం ఉండాలని, ప్రజలు కూడా దాన్ని తమ నైతిక బాధ్యతగా భావించాలన్నారు.

Operation Smile Programme : రాచకొండ పరిధిలో మానవ అక్రమ రవాణా మరియు బాల కార్మిక వ్యవస్థను(Child Labour) నిర్మూలించడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని సీపీ పేర్కొన్నారు. మానవ అక్రమ రవాణా మీద ఉక్కు పాదం మోపుతున్నమని, ప్రత్యేక బృందాల ద్వారా ఎంతో మందిని రక్షించామని, కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. ఒడిశా, బిహార్ వంటి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఇటుక బట్టి కార్మికుల పిల్లలు విద్యకు దూరం కాకూడదు అని వారి నివాస ప్రాంతం లోనే వర్క్ సైట్ పాఠశాలలను నడుపుతున్నట్టు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మహిళ భద్రత విభాగం డీసీపీ ఉషా విశ్వనాథ్, ఏసీపీ వెంకటేశం, రంగారెడ్డి జిల్లా సంక్షేమ అధికారి కృష్ణారెడ్డి, రంగారెడ్డి జిల్లా సీడబ్ల్యుసీ చైర్మన్ నరేంద్ర, మేడ్చల్ జిల్లా సీడబ్ల్యుసీ రాజా రెడ్డి, యాదాద్రి సీడబ్ల్యుసీ చైర్మన్ జయశ్రీ, రంగారెడ్డి జిల్లా డిప్యూటీ వైద్యాధికారిణి డాక్టర్ గీత, డీసీపీఓ ప్రవీణ్, ఇంతియాజ్, సైదులు, బాలరక్ష భవన్ అధికారులు, చైల్డ్, విద్యాశాఖ అధికారులు, బచపన్ బచావో ఆందోళన్ ప్రతినిధి వెంకటేశ్వర్లు, చైల్డ్ లైన్ అధికారులు తదితరలు పాల్గొన్నారు.

ఈ ఏడాదిలో రోడ్డు ప్రమాదాలు పెరిగాయి - మహిళలపై నేరాలు తగ్గాయి : రాచకొండ సీపీ

ABOUT THE AUTHOR

...view details