తెలంగాణ

telangana

'తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్​ ఉంటారు'

By

Published : Jan 18, 2020, 8:41 AM IST

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్‌.టి.రామారావు 24వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్​ ఎన్టీఆర్​ ఘాట్​ వద్ద కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు.

nandamuri family pays tribute to senior N. T. Rama Rao
'తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్​ ఉంటారు'

విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీఆర్​ 24వ వర్ధంతి పురస్కరించుకుని హైదరాబాద్​లోని ఎన్టీఆర్​ ఘాట్​లో నందమూరి కుటుంబం నివాళులు అర్పించింది.

జూనియర్​ ఎన్టీఆర్, కల్యాణ్​ రామ్, దగ్గుబాటి పురంధేశ్వరి స్వర్గీయ ఎన్టీఆర్​కు నివాళి అర్పించారు. తెలుగు జాతి ఉన్నంత వరకు రామారావు ఉంటారని, ఆయన భౌతికంగా లేకపోయినా ప్రతి తెలుగు వాడి గుండెల్లో జీవించే ఉన్నారని జూనియర్​ ఎన్టీఆర్​ వ్యాఖ్యానించారు.

తమ అభిమాన నటుడు, రాజకీయవేత్తను గుర్తు చేసుకుని పెద్ద సంఖ్యలో నందమూరి ​ అభిమానులు, తెదేపా కార్యకర్తలు ఎన్టీఆర్​ ఘాట్​ వద్దకు చేరుకుని నివాళులు అర్పించారు.

ABOUT THE AUTHOR

...view details