తెలంగాణ

telangana

KCR Election Campaign Today : నేటి నుంచి BRS రెండో విడత ప్రచారం.. ఇవాళ మూడు నియోజకవర్గాల్లో కేసీఆర్ పర్యటన

By ETV Bharat Telangana Team

Published : Oct 26, 2023, 6:58 AM IST

KCR Election Campaign Today: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రెండో విడత ప్రచారం నేడు ప్రారంభం కానుంది. అచ్చంపేట, వనపర్తి, మునుగోడులో ఇవాళ గులాబీ దళపతి ప్రజా ఆశీర్వాద సభలు జరగనున్నాయి. రోజుకు రెండు, మూడు నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. నేటి నుంచి నవంబరు 9 వరకు 35 సభల్లో ఆయన పాల్గొననున్నారు. వాడి వేడి ప్రసంగాలతో ప్రత్యర్థ పార్టీల ఎదురుదాడితో దూకుడుగా పర్యటనలు జరగనున్నాయి. కేసీఆర్ భరోసా పేరిట మెనిఫెస్టోను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేందుకు భారత్ రాష్ట్ర సమితి కసరత్తు చేస్తోంది.

KCR
KCR

KCR Start Second Phase Campaign Today నేటినుంచి ప్రారంభం కానున్న బీఆర్ఎస్ రెండో విడత ప్రచారం

KCR Election Campaign Today :బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రికేసీఆర్ (KCR) మలివిడత ఎన్నికల ప్రచారం ఇవాళ మొదలు కానుంది. 100 నియోజకవర్గాల్లో ప్రచారం లక్ష్యంగా పెట్టుకున్న గులాబీ దళపతి.. రోజుకు రెండు, మూడు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. నేటి నుంచి నవంబరు 9 వరకు 35 సభల్లో ప్రసంగించనున్నారు . ఇవాళ అచ్చంపేట, వనపర్తి, మునుగోడులో ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటారు.

CM KCR Second PhaseElection Campaign Today :ఈనెల 15న బీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రకటించి.. అభ్యర్థులకు బీ ఫాంలు ఇచ్చి.. అదే రోజున ప్రచారంలోకి దిగారు. పార్టీ అభ్యర్థులకు బీ ఫాంలు ఇవ్వడంతో పాటు.. హుస్నాబాద్‌లో ప్రచార భేరీ మోగించారు. రోజుకు రెండు నియోజకవర్గాల చొప్పున.. ఈనెల 18 వరకు హుస్నాబాద్, జనగామ, భువనగిరి, సిరిసిల్ల, సిద్ధిపేట, జడ్చర్ల, మేడ్చల్‌లో సభలు పూర్తి చేశారు. బతుకమ్మ, నవరాత్రులు, దసరా పండగ దృష్ట్యా మధ్యలో విరామం ఇచ్చిన కేసీఆర్.. నేటి నుంచి రెండో విడత ప్రచారానికి బయలుదేరనున్నారు.

CM KCR Bhuvanagiri Public Meeting Speech : 'కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తే.. ధరణి పోయి మళ్లీ దళారుల రాజ్యం వస్తుంది'

BRS Praja Ashirvada Sabha Wanaparthy : రెండో విడతలో రోజుకు దాదాపు మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఇవాళ అచ్చంపేట, వనపర్తి, మునుగోడులో సభలు నిర్వహించి.. శుక్రవారం పాలేరు, మహబూబాబాద్, వర్దన్నపేటలో.. శనివారం కోదాడ, తుంగతుర్తి, ఆలేరు సభల్లో పాల్గొంటారు. ఈనెల 30న జుక్కల్, బాన్సువాడ, నారాయణఖేడ్,.. 31న హుజూర్‌నగర్, మిర్యాలగూడ, దేవరకొండలో ప్రజాశీర్వాద సభలు జరగనున్నాయి. నవంబరు 1న సత్తుపల్లి, ఇల్లందు,.. 2న నిర్మల్, బాల్కొండ, ధర్మపురి,.. 3న భైంసా, ఆర్మూర్, కోరుట్లలో కేసీఆర్ సభలు నిర్వహిస్తారు.

Telangana Assembly Elections 2023 : నవంబరు 5న కొత్తగూడెం, ఖమ్మం,.. 6న గద్వాల, మక్తల్, నారాయణపేట, 7వ తేదీన చెన్నూరు, మంథని, పెద్దపల్లి, 8న సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లిలో కేసీఆర్ ప్రచార సభల్లో ప్రసంగించనున్నారు. నవంబరు 9న గజ్వేల్, కామారెడ్డిలో ముఖ్యమంత్రి నామినేషన్లు వేయనున్నారు. అదే రోజున కామారెడ్డి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ప్రజాశీర్వాద సభలకు బీఆర్ఎస్ భారీగా జనసమీకరణ చేస్తోంది. ప్రతీ సభకు కనీసం లక్ష మందిని తరలించేలా లక్ష్యంగా పెట్టుకుంది.

కేసీఆర్ ఏఏ అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తారనే ఆసక్తి బీఆర్ఎస్ శ్రేణుల్లో నెలకొంది. రెండో విడత ప్రచారం, ప్రసంగాల్లో మరింత దూకుడు పెంచుతారని గులాబీ పార్టీ వర్గాల అంచనా. కాంగ్రెస్, బీజేపీ జాతీయ నేతలు సైతం రానున్నందున.. కేసీఆర్ వాడి వేడి అస్త్రాలతో వాగ్బాణాలు వదిలే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు. మరోవైపు "కేసీఆర్ భరోసా" పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు పార్టీ కసరత్తు చేస్తోంది.

CM KCR Speech at Siddipet Praja Ashirwada Sabha : 'ఈ ఎన్నికల్లో లక్ష మెజార్టీ రికార్డును సిద్దిపేట ప్రజలు బద్దలుకొట్టాలి'

BRS Manifesto 2023 :మేనిఫెస్టోలోని (BRS Manifesto) ప్రతీ అంశాన్ని కేసీఆర్ భరోసాగా చెబుతూ ఇంటింటికి ప్రచారం చేయనున్నారు. ప్రధానంగా 17.. కేసీఆర్ భరోసాలను ప్రజలకు వివరించనున్నారు. అభ్యర్థుల పాదయాత్రలు, ఇంటింటి ప్రచారంతో పాటు.. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం మరింత ముమ్మరం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

CM KCR Speech at Sircilla Public Meeting : 'ధరణి ఉండాలో.. రద్దు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలి'

CM KCR Speech at Jangaon Praja Ashirwada Sabha : 'ఓటు మన తలరాతను మార్చేస్తుంది.. ఎన్నికలప్పుడు వచ్చి ఆపద మొక్కులు మొక్కేవారిని నమ్మొద్దు'

ABOUT THE AUTHOR

...view details