ETV Bharat / state

CM KCR Speech at Sircilla Public Meeting : 'ధరణి ఉండాలో.. రద్దు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలి'

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 17, 2023, 5:43 PM IST

Updated : Oct 17, 2023, 6:22 PM IST

CM KCR Speech at Sircilla Public Meeting : అధికారంలో ఉన్న తొమ్మిదిన్నరేళ్లలోనే తెలంగాణను ఎన్నో అంశాల్లో నంబర్‌వన్‌గా నిలిపామని బీఆర్​ఎస్​ అధినేత, సీఎం కేసీఆర్​ పేర్కొన్నారు. ఇవాళ ప్రధాని రాష్ట్రం గుజరాత్‌లోనూ 24 గంటల విద్యుత్ సరఫరా లేదని.. మన రాష్ట్రంలో 24 గంటలూ కరెంట్ ఇస్తున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో విపక్షాలతో పెద్ద ప్రమాదం పొంచి ఉందన్నారు. ధరణి పోర్టల్ తీసేసి రైతులను ఇబ్బంది పెట్టాలని కాంగ్రెస్‌ చూస్తోందన్న ఆయన.. ధరణి ఉండాలో రద్దు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు.

BRS Praja Ashirwada Sabha in Rajanna Sircilla
CM KCR Speech at Sircilla Public Meeting

CM KCR Speech at Sircilla Public Meeting ధరణి ఉండాలో రద్దు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలి

CM KCR Speech at Sircilla Public Meeting : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్​ ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు, చేసిన అభివృద్ధిని వివరిస్తూనే ప్రతిపక్షాలపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఈ సందర్భంగా తన 70 ఏళ్ల జీవితంలో సిరిసిల్లలో వందలసార్లు తిరిగానని కేసీఆర్‌ పేర్కొన్నారు. ఇక్కడ తన బంధువులు, మిత్రులు చాలా మంది ఉన్నారని తెలిపారు. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని చూస్తే కన్నీళ్లు వచ్చేవని.. ఇప్పుడు అప్పర్‌ మానేరులో చూస్తే ఏడాదంతా నీరే ఉంటోందని హర్షం వ్యక్తం చేశారు.

CM KCR Speech at Jangaon Praja Ashirwada Sabha : 'ఓటు మన తలరాతను మార్చేస్తుంది.. ఎన్నికలప్పుడు వచ్చి ఆపద మొక్కులు మొక్కేవారిని నమ్మొద్దు'

BRS Praja Ashirwada Sabha in Rajanna Sircilla : గతంలో కరీంనగర్‌ ఎంపీగా పోటీ చేస్తే ఆదరించి గెలిపించారని కేసీఆర్‌ గుర్తు చేసుకున్నారు. జిల్లాకు చెందిన ఏడుగురు చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఎంతో చలించిపోయానన్నారు. పార్టీ నిధులు, చందాలు సేకరించి చేనేత కార్మికులకు సహాయం చేశామని తెలిపారు. చేనేత కార్మికులకు పని కల్పించేందుకే బతుకమ్మ చీరల పథకం అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. బతుకమ్మ చీరల పంపిణీ.. కేవలం చేనేత కార్మికులను ఆదుకునేందుకేనన్నారు. అవి నచ్చకపోతే తీసుకోవద్దని.. అంతే కానీ చీరల పంపిణీని రాజకీయం చేయొద్దని కోరారు.

MLC Kavitha Fires on BJP and Congress : 'బీఆర్​ఎస్​ మేనిఫెస్టోపై కాంగ్రెస్​, బీజేపీవి దిగజారుడు మాటలు'

3 కోట్ల టన్నుల వడ్లు పండించి దేశానికే తెలంగాణ అన్నం పెడుతోందని కేసీఆర్‌ అన్నారు. రేషన్‌ కార్డు ఉన్న అందరికీ సన్నబియ్యం ఇవ్వాలని నిర్ణయించామని.. అధికారంలోకి రాగానే ఆ హామీని అమలు చేస్తామని తెలిపారు. విపక్షాలతో పెద్ద ప్రమాదం పొంచి ఉందన్న కేసీఆర్‌.. రైతుబంధు లేకుండా చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. ధరణి పోర్టల్ తీసేసి రైతులను ఇబ్బంది పెట్టాలని చూస్తోందని ఆరోపించారు. ధరణి ఉండాలో.. రద్దు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు.

గుజరాత్​లో కూడా ఇవ్వట్లేదు : తొమ్మిదిన్నరేళ్లలోనే తెలంగాణను ఎన్నో అంశాల్లో నంబర్‌వన్‌గా నిలిపామని స్పష్టం చేశారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ వద్దని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారన్న కేసీఆర్​.. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌ సరిపడా కరెంట్‌ కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. ఇవాళ ప్రధాని రాష్ట్రం గుజరాత్‌లో కూడా 24 గంటల విద్యుత్ సరఫరా లేదని వివరించారు. ఈ క్రమంలోనే ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ తమ ప్రభుత్వమే రాబోతోందని.. మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని కేసీఆర్ స్పష్టం చేశారు.

CM KCR Bhuvanagiri Public Meeting Speech : 'కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తే.. ధరణి పోయి మళ్లీ దళారుల రాజ్యం వస్తుంది'

విపక్షాలతో పెద్ద ప్రమాదం పొంచి ఉంది. రైతుబంధు లేకుండా చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధంగా ఉంది. ధరణి పోర్టల్ తీసేసి రైతులను ఇబ్బంది పెట్టాలని కాంగ్రెస్‌ చూస్తోంది. ధరణి ఉండాలో.. రద్దు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలి. తొమ్మిదిన్నరేళ్లలోనే తెలంగాణను ఎన్నో అంశాల్లో నంబర్‌వన్‌గా నిలిపాం. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ వద్దని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌ సరిపడా కరెంట్‌ కూడా ఇవ్వలేదు. ఇవాళ ప్రధాని రాష్ట్రం గుజరాత్‌లో కూడా 24 గంటల విద్యుత్ సరఫరా లేదు. మీ ఆశీర్వాదంతో మళ్లీ మన ప్రభుత్వమే రాబోతోంది. మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడతా. - సీఎం కేసీఆర్

BRS Incharges For 54 Constituencies : పదేళ్ల ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్లండి.. 54 నియోజకవర్గాల ఇంఛార్జీలకు కేటీఆర్ దిశానిర్దేశం

హ్యాట్రిక్​ పక్కా..: కాళేశ్వరం జలాలతో కరీంనగర్ జిల్లాను సస్యశ్యామలం చేశామని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. సాగునీరు, తాగునీటికి కొదవ లేకుండా చేశామని తెలిపారు. కలలో కూడా ఊహించని విధంగా సిరిసిల్ల జిల్లా అయ్యిందన్న ఆయన.. ఒకప్పుడు డిగ్రీ కాలేజీల కోసం పోరాటం చేసేవాళ్లమని గుర్తు చేశారు. అలాంటిది ఇప్పుడు సిరిసిల్లలో కూడా వైద్య కళాశాల ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్‌ హ్యాట్రిక్ సీఎం కావటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

CM KCR Election Tour : సీఎం కేసీఅర్ ఎన్నికల సభల షెడ్యూల్ ఖరారు.. ఈనెల 15 నుంచి నవంబర్ 9 వరకు..

Last Updated :Oct 17, 2023, 6:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.