ETV Bharat / state

CM KCR Bhuvanagiri Public Meeting Speech : 'కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తే.. ధరణి పోయి మళ్లీ దళారుల రాజ్యం వస్తుంది'

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 16, 2023, 7:03 PM IST

CM KCR Bhuvanagiri Public Meeting Speech : కాంగ్రెస్‌తో ప్రమాదం పొంచి ఉందని.. ప్రజలు ఏమాత్రం ఏమరపాటు వహించినా మళ్లీ దళారుల రాజ్యం వస్తుందని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ హెచ్చరించారు. అభివృద్ధి కొనసాగాలంటే.. మళ్లీ తమ ప్రభుత్వమే రావాల్సిన అవసరం ఉందన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే పాత పథకాలు కొనసాగిస్తూనే.. కొత్త పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

brs praja ashirwada sabha in yadadri bhuvanagiri
CM KCR Bhuvanagiri Public Meeting Speech

CM KCR Bhuvanagiri Public Meeting Speech కాంగ్రెస్‌తో ప్రమాదం పొంచి ఉంది ఏమాత్రం ఏమరపాటు వహించినా మళ్లీ దళారుల రాజ్యం సీఎం కేసీఆర్

CM KCR Bhuvanagiri Public Meeting Speech : ఒకప్పుడు కరువు ప్రాంతమైన భువనగిరిలో ఇప్పుడు పుష్కలంగా పంటలు పండుతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాకుంటే.. భువనగిరి జిల్లా అయి ఉండేది కాదన్నారు. భువనగిరిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అరాచక శక్తులను పెంచి పోషించిందని ఆరోపించారు. రైతుల భూమి మీద రైతులకే హక్కు ఉండాలని ధరణి పోర్టల్ తెచ్చామని తెలిపారు. ఈ క్రమంలోనే గతంలో రైతుల భూమిపై దశల వారీగా 10 మంది అధికారులకు పెత్తనం ఉండేదన్న సీఎం.. ధరణి తెచ్చి అందరి పెత్తనం తీసేశామని స్పష్టం చేశారు. భూమిపై రైతులకే అధికారం ఇచ్చామని.. కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తే కౌలు రైతులు, వీఆర్‌వోల బెడద మళ్లీ వస్తుందని చెప్పారు. ధరణి తీసేస్తే.. పెద్ద ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.

CM KCR Speech at Jangaon Praja Ashirwada Sabha : 'ఓటు మన తలరాతను మార్చేస్తుంది.. ఎన్నికలప్పుడు వచ్చి ఆపద మొక్కులు మొక్కేవారిని నమ్మొద్దు'

ఈ సందర్భంగా రైతులకు 24 గంటల కరెంట్ వద్దని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారని కేసీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తే.. ధరణి పోయి మళ్లీ దళారుల రాజ్యం వస్తుందని ఆరోపించారు. మరోవైపు.. భువనగిరిని కూడా ఐటీ హబ్‌గా చేయాలని కేటీఆర్‌కు చెప్పానని కేసీఆర్‌ తెలిపారు. బీఆర్‌ఎస్‌ మళ్లీ గెలిస్తే భువనగిరిలో ఐటీ పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేసేలా బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో రూపొందించామన్న సీఎం.. పాత పథకాలు కొనసాగిస్తూనే కొత్త పథకాలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ వస్తే భూముల ధరలు పడిపోతాయని భయపెట్టారని.. అయితే ఇవాళ తెలంగాణలో భూముల ధరలు ఏ విధంగా పెరిగాయో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు.

BRS Manifesto 2023 : తెల్లరేషన్‌ కార్డుదారులకు 'కేసీఆర్‌ బీమా.. ప్రతి ఇంటికి ధీమా'.. రూ.4 వందలకే గ్యాస్‌ సిలిండర్‌

మరోవైపు స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి గురించి చెప్పాల్సిన అవసరం లేదని.. వరుస విజయాలతో ముందుకు వెళ్తున్నారని కేసీఆర్ తెలిపారు. కరవు ప్రాంతమైన భువనగిరిలో నేడు అద్భుతంగా పంటలు పండుతున్నాయన్నారు. జిల్లాకు లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో యాదాద్రి భువనగిరి జిల్లా అని పెట్టుకున్నామని గుర్తు చేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక శక్తులను పెంచి పోషించిందని ఆరోపించారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఆగం కావొద్దని.. ప్రగతికి, భవిష్యత్తుకు ఏది ముఖ్యమో ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. కాంగ్రెస్‌తో ప్రమాదం పొంచి ఉందని.. ప్రజలు ఏమాత్రం ఏమరపాటు వహించినా మళ్లీ దళారుల రాజ్యం వస్తుందని హెచ్చరించారు.

MLC Kavitha Fires on BJP and Congress : 'బీఆర్​ఎస్​ మేనిఫెస్టోపై కాంగ్రెస్​, బీజేపీవి దిగజారుడు మాటలు'

స్థానిక ఎమ్మెల్యే గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వరుస విజయాలతో ముందుకు వెళ్తున్నారు. కరవు ప్రాంతమైన భువనగిరిలో నేడు అద్భుతంగా పంటలు పండుతున్నాయి. గత కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక శక్తులను పెంచి పోషించింది. ఎన్నికలు వచ్చినప్పుడు ఆగం కావొద్దు. ప్రగతికి, భవిష్యత్తుకు ఏది ముఖ్యమో ఆలోచించి ఓటు వేయాలి. కాంగ్రెస్‌తో ప్రమాదం పొంచి ఉంది. ప్రజలు ఏమాత్రం ఏమరపాటు వహించినా మళ్లీ దళారుల రాజ్యం వస్తుంది. - సీఎం కేసీఆర్

KTR Fires on Congress and BJP : 'కేసీఆర్​ను తిడితే ఓట్లు రావు.. ఇది ప్రతిపక్షాలు గుర్తు పెట్టుకోవాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.