Adilabad Cotton Farmers Problems :ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో లారీ అసోసియేషన్ ధర్నా కారణంగా పత్తి కొనుగోళ్లు ఒక్కసారిగా స్తంభించిపోయాయి. దీంతో ఎక్కడికక్కడే వందలాది పత్తి వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రజాప్రతినిధులు, అధికారుల జోక్యంతో అసోసియేషన్ ప్రతినిధులు వెనక్కి తగ్గారు. లారీ అసోసియేషన్ ధర్నా కారణంగా వాహనాలను నిలిపివేయగా, పరిశ్రమల్లో పేరుకుపోయిన పత్తి నిల్వలను తరలించేందుకు అవరోధం ఏర్పడింది. పత్తి బేళ్లనుగోదాముల నుంచి తరలించనిదే కొత్తగా చేసే పత్తిని నిల్వ చేయడం కష్టంగా మారుతుందని వ్యాపారులు కొనుగోళ్లు నిలిపివేశారు.
Adilabad Cotton Lorry Drivers Protest : ఉదయం నుంచి వివిధ ప్రాంతాల నుంచి మార్కెట యార్డుకు వచ్చిన పత్తి వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. గంటల తరబడిగా నీరిక్షించిన రైతులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. రైతుల ఆందోళనతో మార్కెట్ యార్డులో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అటు లారీ అసోసియేషన్, జిన్నింగ్ అండ్ ప్రెసింగ్ అసోసియేషన్ నాయకులు పట్టువీడలేదు.
Cotton Farmers Problems Telangana 2023 : ప్రతికూల వాతావరణం.. పత్తి రైతులకు శాపం
"దేశవ్యాప్తంగా లారీ డ్రైవర్లు నిరసన చేపట్టారు. అందులో భాగంగానే పత్తి లారీల డ్రైవర్లు నిరసన చేస్తున్నారు. కలెక్టర్, అధికారులు చెప్పినా వినడం లేదు. వీళ్లు ధర్నా చేయడం వల్ల పత్తి ఎక్కడికక్కడ ఆగిపోయింది. ఎమ్మెల్యేతో మాట్లాడుతున్నాం. డ్రైవర్లతో మాట్లాడి వారి సమస్యలు ఏంటో తీర్చాలని కోరుతాం." - అక్బర్, లారీ అసోసియేషన్ అధ్యక్షుడు