టీ20 ప్రపంచకప్లో టీమ్ఇండియా అక్టోబర్ 24న పాకిస్థాన్తో తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ సీజన్లో టీమ్ఇండియా అన్ని మ్యాచ్లు దాదాపు సాయంత్రం సమయంలోనే ఉన్నాయి. ఈ క్రమంలో పొగమంచు ఆటపై ప్రభావం చూపనుంది. దీనిపై టీమ్ఇండియా కోచ్ రవి శాస్త్రి స్పందించారు. పొగమంచు అధికంగా ఉంటే పేసర్లను రంగంలోకి దించుతామని పేర్కొన్నారు. వార్మప్ మ్యాచ్లోనే ఈ విషయాన్ని గ్రహించిన్నట్లు వెల్లడించారు.
"మ్యాచ్పై మంచు ఎంత మేరకు ప్రభావం చూపుతుందనే దానిపై ఆధారపడి మొదట బౌలింగ్/బ్యాటింగ్ ఏది తీసుకోవాలో నిర్ణయించుకుంటాం. దీనికి అనుగుణంగానే స్పిన్నర్ల/ ఫేసర్లను ఎవరిని బరిలోకి దించాలో తేలుస్తాం."