తెలంగాణ

telangana

నన్ను నేనే అలా ప్రశ్నించుకునేవాడిని- అదే ఇప్పుడు సాయం చేసింది : ఇషాన్‌ కిషన్‌

By ETV Bharat Telugu Team

Published : Nov 24, 2023, 3:34 PM IST

Ishan Kishan India Vs Australia T20 Series : గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్​లో భారత ప్లేయర్ ఇషాన్ కిషన్ అద్భుత ఇన్నింగ్స్​ ఆడాడు. అయితే వరల్డ్​ కప్​లో బెంచ్​కే పరిమితమైనా.. ప్రతి రోజు అలా చేసేవాడినని తెలిపాడు. అదే ఇప్పుడు తనకు సహాయపడిందని అన్నాడు. ఆ వివరాలు మీకోసం.

Ishan Kishan India Vs Australia T20 Series
Ishan Kishan India Vs Australia T20 Series

Ishan Kishan India Vs Australia T20 Series : ఇటీవల ముగిసిన 2023 వన్డే వరల్డ్​కప్​లో యంగ్​ బ్యాటర్ ఇషాన్ కిషన్​కు పెద్దగా అవకాశాలు రాలేదు. అతడు ఒకటి రెండు మ్యాచ్​లు మినహా.. టోర్నీలో బెంచ్​కే పరిమితమయ్యాడు. అయితే తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో మాత్రం.. మెరుపు ఇన్నింగ్స్​తో అదరగొట్టాడు. ఇషాన్ కిషన్ (58 పరుగులు) హాఫ్ సెంచరీలతో చెలరేగాడు. మెగాటోర్నీలో బెంచ్​కే పరిమితమైనా.. నెట్స్​లో ప్రాక్టీస్ చేయడం ఆపలేదట ఇషాన్. ఇప్పుడు అదే తనకు సాయపడిందని అతడు పేర్కొన్నాడు.

"వరల్డ్‌ కప్‌ సందర్భంగా నేను తుది జట్టులో లేనప్పటికీ రెగ్యులర్​గా ప్రాక్టీస్ చేశా. 'ఈరోజు నేనేం చేయాలి. ఈ సెషన్‌ నాకు ఎందుకు ముఖ్యం' అని నన్ను నేను ప్రశ్నించుకునేవాడిని. నెట్స్‌లో బాగా ప్రాక్టీస్ చేస్తునే ఉన్నా. నా ఆట గురించి ఎప్పటికప్పుడు కోచింగ్‌ సిబ్బందితో నా మాట్లాడా. ఏ బౌలర్‌ను టార్గెట్‌ చేయాలి? ఇన్నింగ్స్​ను ఎలా ముందుకు నడిపించాలి? లెఫ్ట్​ హ్యాండ్​ బ్యాటర్‌గా లెగ్‌ స్పిన్నర్‌ వేసే బంతులపై నాకు ఓ అంచనా ఉంది." అని ఇషాన్ పేర్కొన్నాడు.

"పెద్ద టార్గెట్​లు ఛేజ్ చేసేటప్పుడు.. చివరి దాకా క్రీజులో ఉండేందుకు ప్రయత్నించాలి. తప్పకుండా ఒక బౌలర్‌ను లక్ష్యంగా చేసుకొని ఎటాక్​ చేయాలి. ఈ ఇన్నింగ్స్‌పై సూర్యకుమార్‌తో మాట్లాడాను. సంఘా బౌలింగ్‌ను ఎటాక్‌ చేయాలాని అనుకున్నాం. స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లను కోల్పోయాం. అప్పుడు పార్ట్​నర్​షిప్ ముఖ్యమని నాకు తెలుసు. ఐపీఎల్‌లో మేమిద్దరం కలిసి ఆడిన అనుభవం ఉంది. మా ఇద్దరికి ఒకరి ఆట గురించి ఒకరికి తెలుసు. విశాఖ పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలంగా లేదు. మనోళ్లతోపాటు ఆసీస్ స్పిన్నర్లు కూడా ఇబ్బంది పడ్డారు. ఇంగ్లిస్‌ ఆడిన తీరు చూస్తే.. బ్యాటింగ్‌కు పిచ్‌ అనుకూలంగానే అనిపించింది. ఛేజింగ్​లోనూ మేం ఒత్తిడికి గురికాలేదు. ఇక చివర్లో రింకూ అద్భుతం" అని ఇషాన్ అన్నాడు.

విశాఖపట్టణం వేదికగా గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో భారత్​ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆసీస్ నిర్దేశించిన 209 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమ్‌ఇండియా 19.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

చరిత్ర సృష్టించిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్- టీవీల్లో 30 కోట్ల మంది వీక్షణం

మాజీ క్రికెటర్ శ్రీశాంత్​పై ఛీటింగ్​ కేసు! - రూ. 18.70 లక్షలు మోసగించారని!

ABOUT THE AUTHOR

...view details