ETV Bharat / sports

చరిత్ర సృష్టించిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్- టీవీల్లో 30 కోట్ల మంది వీక్షణం

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 23, 2023, 7:50 PM IST

Updated : Nov 23, 2023, 10:52 PM IST

World Cup 2023 Viewership Worldwide : ఇటీవల ముగిసిన వరల్డ్​ కప్​ అటు టీవీ ఇటు ఆన్​లైన్​ వ్యూయర్​షిప్​ రికార్డులను బద్దలు కొట్టింది. ఈ మేరకు అధికారికి గణాంకాలను బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు.

World Cup 2023 Viewership Worldwide
World Cup 2023 Viewership Worldwide

World Cup 2023 Viewership Worldwide : దాదాపు నెలన్నర రోజుల పాటు సాగిన 2023 వన్డే వరల్డ్​ టోర్నీ.. క్రికెట్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. టీమ్ఇండియా ఆడిన మ్యాచ్​లకు వేల సంఖ్యలో ప్రేక్షకులు స్టేడియాలకు హాజరయ్యారు. నాన్​ ఇండియా మ్యాచ్​లకు కూడా భారీగా అభిమానులు తరలివచ్చారు. వరల్డ్ కప్​ మొత్తంలో దాదాపు 12 లక్షల మంది స్టేడియాల్లో ప్రత్యక్షంగా మ్యాచ్​లను చూశారు.

అయితే నవంబర్ 19న అహ్మదాబాద్​లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టీమ్ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్​ను ప్రత్యక్షంగా దాదాపు 1.3 లక్షల మంది వీక్షించారు. అంతేకాకుండా టీవీల్లో లైవ్‌లో దాదాపు 30 కోట్ల మంది మ్యాచ్‌ను వీక్షించారని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు- బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. భారతీయ టెలివిజన్ చరిత్రలో అత్యధికంగా వీక్షించిన కార్యక్రమంగా ఈ మ్యాచ్​ నిలిచిందన్నారు.

  • A staggering 30 Crore fans watched the @cricketworldcup 2023 Final on TV making it the most watched event of any kind in Indian television history. Peak TV Concurrency also reached a historic high of 13 Crore (peak digital concurrency was 5.9 Crore, also a world record).
    We are… pic.twitter.com/v5YCp0l04D

    — Jay Shah (@JayShah) November 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

డిజిటల్​లో రికార్డు బద్దలు..
Hotstar Highest Live Watching : క్రికెట్​లో అతిపెద్ద టోర్నమెంట్​లో ఆస్ట్రేలియా ఫైనల్​లో భారత్​ను ఓడించి.. 2023 వరల్డ్​కప్ విజేతగా నిలిచింది. అయితే స్వదేశంలో జరుగుతున్న ఈ మెగాటోర్నీలో టీమ్ఇండియా ఫైనల్​కు చేరుకోవడం.. ఫ్యాన్స్​లో మరింత ఉత్సాహం నింపింది. దీంతో నవంబర్ ఆదివారం 19న జరిగిన ఫైనల్​ మ్యాచ్​కు ఎప్పుడూ లేనంత క్రేజ్ దక్కింది. భారత్ ప్రపంచకప్ టోఫ్రీని ముద్దాడుతుంటే చూద్దామని, అహ్మదాబాద్​ స్టేడియానికి దాదాపు 1.2 లక్షల మంది ప్రేక్షకులు హాజరయ్యారు. టాస్ గెలిచిన ఆసీస్.. టీమ్ఇండియాను బ్యాటింగ్​కు ఆహ్వానించింది. దీంతో తొలుత బ్యాటింగ్​కు దిగిన టీమ్ఇండియా ఆరంభంలో అదరగొట్టింది. కెప్టెన్ రోహిత్ శర్మ (47 పరుగులు, 4 ఫోర్లు, 3 సిక్స్​లు), విరాట్ కోహ్లీతో కలిసి.. కాసేపు స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ క్రీజులో ఉన్నప్పుడు.. ఓటీటీ ప్లాట్​ఫామ్​ డిస్నీ+ హాట్​స్టార్​లో 5.9 కోట్ల మంది లైవ్​ చూశారు. దీంతో వ్యూయర్‌షిప్‌ పరంగా.. ఈ ఫైనల్ మ్యాచ్​ గత రికార్డు (5.3 కోట్లు)ను బద్దలుకొట్టింది. అయితే ఇప్పటివరకు హాట్​స్టార్​లో నమోదైన అత్యధిక వ్యూయర్‌షిప్‌ ఇదేనని సంస్థ హెడ్ సాజిత్ శివానంద్ తెలిపారు. ఇంత భారీ సంఖ్యలో క్రికెట్​ మ్యాచ్​ చూడా ఇదే తొలిసారి.

మాజీ క్రికెటర్​పై ఐసీసీ వేటు- ఆరేళ్ల పాటు నిషేధం- ఎందుకో తెలుసా?

మొదలైన ఐపీఎల్​ 2024 ఫీవర్- మినీ వేలంలో 590 మంది ప్లేయర్లు!

Last Updated : Nov 23, 2023, 10:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.