తెలంగాణ

telangana

IPL: దుబాయ్‌లో ధోనీసేన సందడి షురూ

By

Published : Aug 14, 2021, 2:40 PM IST

ఐపీఎల్దు కోసం దుబాయ్​లో అడుగుపెట్టిన ధోనీసేన అప్పుడే సందడి మొదలు పెట్టేసింది. శుక్రవారం రాత్రే సీఎస్​కే అక్కడికి చేరుకోగా.. క్రికెటర్ల ప్రయాణాన్ని, చేస్తున్న సరదాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

IPL
ధోనీ

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ రెండో దశ ఆరంభానికి మరో నెల రోజులే ఉంది. ఈ క్రమంలో అప్పుడే సందడి మొదలైంది. వేదిక యూఈఏకి మారడం వల్ల ఫ్రాంచైజీలన్నీ ముందుస్తుగా అక్కడ ఏర్పాట్లు చేస్తున్నాయి. మూడుసార్లు విజేత చెన్నై సూపర్‌కింగ్స్‌ శుక్రవారం రాత్రే అక్కడికి చేరుకుంది. ఈ మేరకు ఆ ఫ్రాంచైజీ ఓ వీడియోను ట్వీట్‌ చేసింది.

కెప్టెన్ ధోనీ, సురేశ్‌ రైనా, రుతురాజ్‌ గైక్వాడ్‌, రాబిన్‌ ఉతప్ప సహా ఇతర క్రికెటర్లు, సహాయ సిబ్బంది దుబాయ్‌ చేరుకున్నారు. వారితో పాటు కుటుంబసభ్యులూ ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను పంచుకున్న సీఎస్‌కే 'దుబాయ్‌కి మరోసారి వణక్కం' అని ట్యాగ్‌ జత చేసింది. ఈ వీడియోలో సీఎస్‌కే బస చేస్తున్న హోటల్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ గదిని చూపించారు.

సీఎస్‌కే సహాయ కోచ్‌లు లక్ష్మీపతి బాలాజీ, మైక్‌ హస్సీ సహా ఇతర ఫ్రాంచైజీ ఆటగాళ్లకు వైరస్‌ సోకడం వల్ల ఈ సీజన్‌ వాయిదాపడింది. గతేడాది చిత్తుగా ఓడిపోయిన ధోనీసేన.. ఈ సారి మంచి ఫామ్‌లోనే ఉంది! ఐదు మ్యాచులు గెలిచి రెండింట్లోనే ఓడింది. పట్టికలో రెండో స్థానంలో ఉంది. మరో రెండు మ్యాచులు గెలిచారంటే వారు ప్లేఆఫ్స్‌కు చేరుకోవడం లాంఛనమే. దుబాయ్‌ వేదికగా సెప్టెంబర్‌ 19న సీఎస్‌కే డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయితో తలపడనుంది.

ఇదీ చూడండి:సన్​రైజర్స్​ ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్.. వార్నర్ వచ్చేస్తున్నాడు

ABOUT THE AUTHOR

...view details