Chiranjeevi mother birthday: క్వారంటైన్లో ఉండటం వల్ల తన మాతృమూర్తి అంజనాదేవీని కలవలేకపోతున్నానని మెగాస్టార్ చిరంజీవి బాధపడ్డారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన.. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. తన తల్లి పుట్టినరోజు శనివారం పురస్కరించుకుని సోషల్మీడియా వేదికగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. తల్లి, సతీమణితో కలిసి దిగిన ఓ ఫొటోను ట్విటర్ వేదికగా షేర్ చేశారు.
"అమ్మా.. నీకు జన్మదిన శుభాకాంక్షలు. క్వారంటైన్లో ఉన్న కారణంగా ప్రత్యక్షంగా కలుసుకొని నీ ఆశీస్సులు తీసుకోలేక ఇలా విషెస్ తెలుపుతున్నాను. నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు.. మరు జన్మలకి కూడా కావాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నా. ప్రేమతో.. శంకరబాబు" అని చిరు తన ట్వీట్లో పేర్కొన్నారు.