తెలంగాణ

telangana

'దాదా సాహెబ్​ ఫాల్కే' అవార్డు వేడుకకు బిగ్​బీ​ దూరం..!

By

Published : Dec 23, 2019, 10:15 AM IST

దిల్లీ వేదికగా నేడు జరగనున్న జాతీయ చలన చిత్ర పురస్కార ప్రదానోత్సవానికి బాలీవుడ్​ సూపర్​స్టార్​ అమితాబ్​ బచ్చన్ హాజరుకావడం లేదు. అనారోగ్యం కారణంగా కార్యక్రమానికి రాలేకపోతున్నట్లు ట్విట్టర్​ వేదికగా వెల్లడించాడు బిగ్​బీ. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఆయనకు 'దాదా సాహెబ్​ ఫాల్కే' అవార్డు ఇవ్వాలని నిర్వాహకులు భావించారు.

2019 National Film Awards
'దాదా సాహెబ్​ ఫాల్కే' అవార్డు వేడుకకు బిగ్​బీ​ దూరం..!

అనారోగ్యం కారణంగా జాతీయ చలన చిత్ర పురస్కారాల ప్రాదానోత్సవానికి దూరం అవుతున్నట్లు ట్విట్టర్​ వేదికగా తెలిపాడు బాలీవుడ్​ షెహెన్​ షా అమితాబ్. దిల్లీ వేదికగా నేడు ఈ వేడుక జరగనుంది. దీనికి ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరుకానున్నారు.

"జ్వరంతో బాధపడుతున్నా. ప్రయాణం చేసే స్థితిలో లేను. అందుకే దిల్లీలో జరగనున్న జాతీయ చలన చిత్ర అవార్డులకు దూరమవుతున్నా. కార్యక్రమానికి హాజరుకానందుకు విచారిస్తున్నా."

-అమితాబ్​ బచ్చన్​, సినీ నటుడు

అమితాబ్​... దాదాపు 60 ఏళ్లు సినీరంగంలో సేవలకు గానూ 2018 ఏడాదికి చెందిన 'దాదా సాహెబ్​ ఫాల్కే' అవార్డును సెప్టెంబర్​లో ఆయనకు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.

75 శాతం పాడైంది...!

అమితాబ్​ కొంత కాలంగా కాలేయం సమస్యతో బాధపడుతున్నాడు. క్షయ, హైపటైటిస్​ బి వ్యాధులను సరైన సమయంలో గుర్తించకపోవడం వల్ల కాలేయం 75 శాతం చెడిపోయిందని ఆయనే ఓ సమావేశంలో వెల్లడించాడు. ఇటీవల బిగ్​ బచ్చన్​ 5 కేజీల బరువు తగ్గడం ఆయన ఆరోగ్యంపై ఆందోళన కలిగించింది.

ఈ మధ్య కాలంలో కొన్ని రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందిన అమితాబ్... ఇటీవల ఇంటికి వచ్చినప్పటి నుంచి విశ్రాంతి తీసుకోకుండా యథావిధిగా షూటింగ్​లకు హాజరయ్యాడు. త్వరలో విడుదల కానున్న 'చెహ్రే' చిత్రం కోసం ఇటీవల మంచుప్రాంతమైన స్లోవేకియాలో... చిత్రీకరణలో పాల్గొన్నాడు ఈ 77 ఏళ్ల సినీయర్​ నటుడు. ఫలితంగా మళ్లీ అనారోగ్యం పాలయ్యాడు.

ABOUT THE AUTHOR

...view details