తెలంగాణ

telangana

ఆసుపత్రిలో కాల్పుల కలకలం.. నిందితుడితో సహా ఐదుగురు మృతి

By

Published : Jun 2, 2022, 6:35 AM IST

Updated : Jun 2, 2022, 7:55 AM IST

అమెరికాలోని ఓక్లహోమాలో తుపాకుల మోత మోగింది. ఆసుపత్రి క్యాంపస్​లోని మెడికల్​ బిల్డింగ్​లో జరిగిన కాల్పుల ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో నిందితుడు కూడా ఉన్నాడు.

Gun shooting at Oklahoma
Gun shooting at Oklahoma

Mass shooting at Oklahoma: అమెరికాలో మరోమారు తుపాకుల మోత మోగిపోయింది. ఓక్లహోమాలోని తుల్సా నగరంలో ఓ వ్యక్తి తుపాకీతో చెలరేగాడు. సెయింట్ ఫ్రాన్సిస్ ఆసుపత్రి ప్రాంగణంలో బుధవారం జరిగిన ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. కాల్పులు జరిపిన వ్యక్తి కూడా చనిపోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. అయితే అతడు ఎలా మరణించాడనేది ఇంకా నిర్ధరణ కాలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపడుతున్నామని చెప్పారు.

ఇటీవల అమెరికాలో కాల్పుల ఘటనలు పెరుగుతున్నాయి. మంగళవారం.. న్యూ ఒర్లీన్స్‌లో ఓ పాఠశాల స్నాతకోత్సవంలో ఇద్దరు మహిళల మధ్య తలెత్తిన వివాదం కాల్పులకు దారి తీసింది. ఈ ఘటనలో ఓ వృద్ధురాలు మృతి చెందగా.. ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. అయితే ఈశాన్య లూసియనా వర్సిటీలో జరిగిన పాఠశాల స్నాతకోత్సవంలో కాల్పులు జరిగి నలుగురు గాయపడిన ఘటన జరిగిన రెండు వారాల తర్వాత మరోమారు తుపాకీ పేలటంపై ఆందోళన వ్యక్తం చేశారు స్థానికులు.
ఓక్లహోమాలోని తుల్సాలో జరిగిన కాల్పులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సంతాపం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్థానిక అధికారులతో చర్చిస్తున్నామని, నిశితంగా పర్యవేక్షిస్తున్నామని శ్వేత సౌధ వర్గాలు తెలిపాయి.

Last Updated :Jun 2, 2022, 7:55 AM IST

ABOUT THE AUTHOR

...view details