Lavanya Tripathi On OTT: ప్రస్తుతం సినిమాలకు దీటుగా వెబ్ సిరీస్లు.. నటీనటులకు మంచి పేరు తీసుకొస్తున్నాయి. గత రెండు, మూడేళ్లుగా టాలీవుడ్లో వెబ్సిరీస్ రూపొందించే ధోరణి పెరుగుతోంది. హీరోహీరోయిన్లు.. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్సిరీస్ల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా హీరోయిన్ లావణ్య త్రిపాఠి డిజిటల్ ప్లాట్ఫామ్లోకి అరంగేట్రం చేస్తున్నారు.
'అందాల రాక్షసి' సినిమాతో కథానాయికగా పరిచయమైన ఆమె.. జయాపజయాలకు అతీతంగా టాలీవుడ్లో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. కెరీర్లో తొలిసారి ఆమె ఓ వెబ్సిరీస్ను అంగీకరించారు. 'పులి మేక' అనే టైటిల్తో ఈ వెబ్సిరీస్ రూపొందుతుంది. ఇందులో లావణ్య త్రిపాఠితో పాటు హీరో ఆది లీడ్రోల్ చేస్తున్నారు. బిగ్బాస్ ఫేమ్ సిరిహనుమంత్, సుమన్, ముక్కు అవినాష్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. క్రైమ్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సిరీస్ను 'జీ5 ఓటీటీ' సంస్థతో కలిసి రచయిత కోన వెంకట్ నిర్మిస్తున్నారు. పోలీస్ బ్యాక్డ్రాప్కు ఆస్ట్రాలజీ అంశాలను ముడిపెడుతూ ఈ సిరీస్ను తెరకెక్కిస్తున్నారు.