తెలంగాణ

telangana

ప్రేమ విఫలమై.. రైలు పట్టాలపై యువకుడు ఆత్మహత్య

By

Published : May 29, 2022, 5:10 PM IST

suicide on railway track

Suicide on Railway Track: ప్రేమించిన అమ్మాయి తన ప్రేమను అంగీకరించకపోవడంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేయసి లేని జీవితం వ్యర్థమని భావించాడో ఏమో.. రైలు పట్టాలపై పడి ఛిద్రమై పోయాడు. కన్నవారికి తీరని శోకాన్ని మిగిల్చాడు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రైల్వే స్టేషన్​లో ఈ ఘటన చోటుచేసుకుంది.

Suicide on Railway Track: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఓ యువకుడు ప్రేమ విఫలమై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రాణానికి ప్రాణంగా ఓ యువతిని ప్రేమించిన యువకుడు.. ఆమె ససేమిరా అనడంతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలం చంద్రపల్లి గ్రామానికి చెందిన దుర్గం శశికాంత్.. మూడేళ్ల క్రితం పని నిమిత్తం బెల్లంపల్లికి వచ్చాడు. టేకుల బస్తీలో నివాసముంటున్న అతను.. ఓ యువతిని ఏడాదికాలంగా ప్రేమిస్తున్నాడు.

తన ప్రేమను యువతికి తెలియజేసిన శశికాంత్.. ఆమె నిరాకరించడంతో మనస్తాపం చెందాడు. దీంతో ఆమె లేని జీవితం వ్యర్థమని భావించి.. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కన్నాలబస్తీ రైల్వే వంతెన సమీపంలో రైలు కింద పడి బలవన్మరణం చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని.. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించినట్లు చెప్పారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఆత్మహత్య చేసుకున్న దుర్గం శశికాంత్

ఇవీ చదవండి:Fire accident at urumadla: మంటల్లో దగ్ధమైన సుబాబుల్ చెట్లు.. భారీగా ఆస్తినష్టం

భర్తపై అనుమానం.. యువతిపై నలుగురితో ఆత్యాచారయత్నం చేయించిన వివాహిత

ABOUT THE AUTHOR

...view details