జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తిలో దారుణం చోటుచేసుకుంది. భర్త రాజాగంగారంను భార్య భాగ్యలక్ష్మి హత్య చేసింది. కుటుంబ కలహాలతోనే హత్య జరిగినట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మద్యం తాగొచ్చి భార్యపై భర్త రాజాగంగారం దాడిచేశాడు. తన ఆత్మరక్షణ కోసం భర్తను కత్తెరతో పొడిచి చంపినట్లు భాగ్యలక్ష్మి పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం మెట్పల్లి ఆసుపత్రికి తరలించారు.