సంగారెడ్డి జిల్లా పటాన్చెరు వైపు ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను లక్డారం వద్ద ఓ లారీ డ్రైవర్ ఢీకొట్టి వెళ్లిపోయాడు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
బైక్ను ఢీకొట్టిన లారీ డ్రైవర్ అరెస్టు
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతికి కారణమైన లారీ డ్రైవర్ను పటాన్చెరు పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. మద్యం తాగి వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలిపారు.
![బైక్ను ఢీకొట్టిన లారీ డ్రైవర్ అరెస్టు Lorry driver arrested, lorry driver arrested in Patan lake, Sangareddy district news, Sangareddy district crime news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11:42:29:1619763149-tg-hyd-57-29-driver-remond-av-ts10056-29042021200554-2904f-1619706954-607.jpg)
లారీ డ్రైవర్ అరెస్టు, పటాన్చెరులో లారీ డ్రైవర్ అరెస్టు, సంగారెడ్డి జిల్లా వార్తలు, సంగారెడ్డి జిల్లా నేర వార్తలు
శంషాబాద్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో లారీ డ్రైవర్ మద్యం సేవించినట్లు నిర్ధరణ అయింది. లక్డారం జాతీయ రహదారిపై ప్రమాదం చేసింది ఆ వ్యక్తేనని తెలియగా పటాన్చెరు పోలీసులకు సమాచారం అందించారు. నిందితుణ్ని అదుపులోకి తీసుకున్న పటాన్చెరు పోలీసులు.. రిమాండ్కు తరలించారు. డ్రైవర్ మహారాష్ట్రకు చెందిన మహదేవ్ బోరేగా గుర్తించారు. మద్యం సేవించడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలిపారు.
Last Updated : Apr 30, 2021, 1:13 PM IST