తెలంగాణ

telangana

AR SI Dead: సస్పెన్షన్ ఉత్తర్వులతో మనస్తాపం.. చోరీకి పాల్పడిన ఏఆర్ ఎస్సై మృతి

By

Published : Sep 16, 2021, 4:48 PM IST

ar-si-committed-theft-died-in-chittoor-district
ar-si-committed-theft-died-in-chittoor-district

ఏపీలోని చిత్తూరు నగరంలో వస్త్రాలు చోరీ చేస్తూ.. దొరికిన ఓ పోలీసు అధికారి మృతి చెందాడు. ఉన్నతాధికారులు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేయడంతో మనస్తాపానికి గురై మరణించినట్లు పోలీసులు తెలిపారు.


ఏపీలోని చిత్తూరు నగరంలో ఓ వ్యాపారి వ్యానులో పెట్టిన దుస్తులను చోరీ చేస్తూ దొరికిపోయిన.. ఏఆర్ ఎస్సై మహమ్మద్ మృతి చెందాడు. నాలుగు రోజుల కిందట కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఒక కానిస్టేబుల్​తో కలిసి దుస్తులు దొంగతనం చేసిన ఘటనలో.. సీసీ పుటేజీ ఆధారంగా మహమ్మద్​ను పోలీసు శాఖ ఉన్నతాధికారులు విధులు నుంచి తాత్కాలికంగా తొలగించారు.

అనంతరం ఆయనను అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. సస్పెన్షన్​కు సంబంధించిన ఉత్తర్వులు బుధవారం అందడంతో.. తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఇవాళ ఉదయం మహమ్మద్ వాంతులు చేసుకోగా.. జైలు అధికారులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న సదరు అధికారి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

అసలు ఏం జరిగిందంటే..

చిత్తూరులో వస్త్రాలు విక్రయించే స్థలంలో ఏఆర్‌ ఎస్సై, కానిస్టేబుల్ చోరీకి పాల్పడ్డారు. రెండ్రోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పీవీకేఎన్‌ కళాశాల నుంచి కలెక్టరేట్‌కు వెళ్లే మార్గంలో.. ఓ వ్యక్తి బట్టల వ్యాపారాన్ని ప్రారంభించాడు. వ్యానులో దుస్తులు ఉంచి విక్రయింస్తుంటాడు. రాత్రి దుకాణం మూసి బట్టలన్నీ మూట కట్టి తరువాత రోజు పొద్దున్నే యథావిధిగా వచ్చాడు. చూసేసరికి బట్టలు తక్కువుగా ఉండడాన్ని గుర్తించాడు.

ఎవరికీ తెలియకుండా అమర్చిన సీసీ కెమేరా ఫుటేజీ చూసేసరికి యూనిఫాంలో ఉన్న ఎస్సై, కానిస్టేబుల్ కాజేసినట్లు గుర్తించాడు. ఆ ఫుటేజీని పోలీసులకు ఇచ్చి ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటనపై స్పందించిన ఎస్పీ సెంథిల్‌కుమార్.. వస్త్రాల చోరీకి పాల్పడిన ఎస్సై మహమ్మద్‌, కానిస్టేబుల్ ఇంతియాజ్‌ను అరెస్ట్ చేశారు. విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు ఇచ్చారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details