ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు...డ్రగ్స్ నిర్మూలనకు ద్విముఖవ్యూహం.. KCR review on drug use control: వినూత్నరీతిలో ఆలోచించి బాధ్యతతో ప్రతి ఒక్కరి సహకారం తీసుకొని సామాజిక ఉద్యమంగా మలచినప్పుడే రాష్ట్రంలో మాదకద్రవ్యాల నియంత్రణ సాధ్యమవుతుందని పోలీసు, ఎక్సైజ్ శాఖ అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. డ్రగ్స్ నియంత్రణ విషయంలో ఎంతటివారినైనా ఉపేక్షించవద్దన్నారు.ఫీవర్ సర్వే దేశానికే ఆదర్శం.. Harish Rao Khammam Tour: త్వరలోనే ఆదిలాబాద్లో క్యాథ్ ల్యాబ్ సేవల్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ఇప్పటివరకు కేవలం హైదరాబాద్లోని ఆస్పత్రులకు పరిమితమైన గుండె సంబంధిత వైద్యసేవల్ని.. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల వరకు విస్తరించి ప్రజల ప్రాణాలు కాపాడాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని హరీశ్ రావు వెల్లడించారు.రాష్ట్రంలో కొనసాగుతోన్న కరోనా ఉద్ధృతి.. Telangana Corona Cases: రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. వేల సంఖ్యలో కేసులు నమోదవుతునే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 97,579 మందికి కొవిడ్ నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. 3,877 మందికి మహమ్మారి సోకినట్టు నిర్ధరణైంది.కేరళలో కరోనా విజృంభణ.. State Wise Covid Cases: కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 54 వేల మందిపైగా వైరస్ బారిన పడ్డారు. మరోవైపు దేశంలోని పలు రాష్ట్రాల్లో రోజువారీ కొవిడ్ కేసుల్లో తగ్గుదల కనిపిస్తోంది. దిల్లీ కొత్తగా నాలుగు వేలకుపైగా కేసులు వెలుగు చూడగా.. పాజిటివిటీ రేటు తగ్గింది. మహారాష్ట్రలోని ధారావిలో కొవిడ్ కేసులు సున్నాగా నమోదయ్యాయి.దక్షిణాది రాష్ట్రాలకు కీలక సూచనలు.. Covid Situation in Southern States: దక్షిణాది రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులు, టీకా పంపిణీలో పురోగతి, వైరస్పై పోరుకు చేసిన ఏర్పాట్లను సమీక్షించారు కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ. కొవిడ్ నిర్వహణకు కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని ప్రశంసించారు.మోదీ ఇమేజ్ మళ్లీ అధికారాన్ని కట్టబెట్టేనా? uttarakhand polls 2022 : ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార భాజపా- ప్రతిపక్ష కాంగ్రెస్ నువ్వా? నేనా? అన్న రీతిలో తలపడుతున్నాయి. రాష్ట్రంలో ద్విముఖ పోటీ నెలకొన్న నేపథ్యంలో భాజపా తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటుందా? ముఖ్యమంత్రుల మార్పు ఓటర్లను ఎంత మేరకు ప్రభావితం చేస్తుంది?61 ఏళ్ల వయసులో 'నీట్' పాస్.. Retired teacher pass in NEET: 61 ఏళ్ల వయస్సులో నీట్ పరీక్షలో ఉత్తీర్ణత పొంది ఎంబీబీఎస్ సీటు సాధించారు ఓ రిటైర్డ్ ఉపాధ్యాయుడు. అయితే.. చివరి నిమిషంలో తన ఎంబీబీఎస్ సీటును వదులుకుని అందరి ప్రశంసలు అందుకున్నారు.పబ్జీకి బానిసై కుటుంబాన్ని కాల్చేశాడు.. Minor Shot Family: పబ్జీ గేమ్కు బానిసైన ఓ బాలుడు తన కుటుంబాన్ని హతమార్చాడు. తల్లి, తోబుట్టువులు నిద్రిస్తున్న సమయంలో వారిని కాల్చిచంపాడు. శుక్రవారం ఈ ఘటన వెలుగు చూసింది.నాలుగోసారి ఛాంపియన్గా పెర్త్ స్కార్చర్స్.. BBL finals: బిగ్బాష్ లీగ్ ఫైనల్స్లో ఘన విజయం సాధించింది పెర్త్ స్కార్చర్స్. సిడ్నీ సిక్సర్స్ను 79 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. నాలుగోసారి టైటిల్ కైవసం చేసుకుంది.కొత్త సినిమాల ముచ్చట్లు.. కొత్త సినిమాల అప్డేట్లు వచ్చేశాయి. ఇందులో శ్రుతి హాసన్ వెబ్సిరీస్, 'ఆడవాళ్లు మీకు జోహార్లు', 'డీజే టిల్లు' సినిమాల విశేషాలున్నాయి.