Harish Rao Khammam Tour: 'రాష్ట్రవ్యాప్త ఫీవర్ సర్వే దేశానికే ఆదర్శం'

author img

By

Published : Jan 28, 2022, 6:52 PM IST

Minister Harish Rao started Cath Lab in Khammam

Harish Rao Khammam Tour: త్వరలోనే ఆదిలాబాద్​లో క్యాథ్ ల్యాబ్ సేవల్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు స్పష్టం చేశారు. ఇప్పటివరకు కేవలం హైదరాబాద్​లోని ఆస్పత్రులకు పరిమితమైన గుండె సంబంధిత వైద్యసేవల్ని.. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల వరకు విస్తరించి ప్రజల ప్రాణాలు కాపాడాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని హరీశ్ రావు వెల్లడించారు. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన క్యాథ్ ల్యాబ్ విభాగాన్ని మంత్రి ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం చేపట్టిన రాష్ట్ర వ్యాప్త ఫీవర్ సర్వేకు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం దేశవ్యాప్తంగా ఫీవర్ సర్వేను చేపడుతోందన్నారు.

రాష్ట్రవ్యాప్త ఫీవర్ సర్వే దేశానికే ఆదర్శం

Harish Rao Khammam Tour: ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావుకు తెరాస శ్రేణులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. కూసుమంచి మండలం నాయకన్ గూడెం వద్ద తెరాస నేతలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి ఖమ్మం చేరుకున్న మంత్రి హరీశ్​రావు.. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ నామా నాగేశ్వరరావు, పలువురు ప్రజాప్రతినిధులు, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో కలిసి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో నూతనంగా రూ.7.5 కోట్లతో ఏర్పాటు చేసిన క్యాథ్ ల్యాబ్ విభాగాన్ని ప్రారంభించారు. అనంతరం ట్రామాకేర్ విభాగం, ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో కాలినడకన తిరుగుతూ పరిశీలించారు. అనంతరం మాతాశిశు సంరక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన తల్లి పాల నిల్వ నిధి కేంద్రాన్ని ప్రారంభించారు.

ఇప్పటివరకు హైదరాబాద్​లోని నిమ్స్, ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకే పరిమితమైన క్యాథ్ ల్యాబ్ విభాగాన్ని.. జిల్లా స్థాయి ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసే క్రమంలో ఖమ్మంలో నాలుగో ల్యాబ్ ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఇప్పటికే వరంగల్​లో క్యాథ్ ల్యాబ్ పనిచేస్తుందన్న మంత్రి.. త్వరలోనే ఆదిలాబాద్​లోనూ ఏర్పాటు చేస్తామన్నారు. హైదారాబాద్​కు దూరంగా ఉన్న ప్రాంతాల్లో గుండె సంబంధిత వ్యాధులకు వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవడం వల్ల ప్రజల ప్రాణాలు కాపాడవచ్చన్నది ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోని మార్చురీలను పూర్తిగా ఆధునీకరించాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.

"ప్రభుత్వం చేపట్టిన రాష్ట్ర వ్యాప్త ఫీవర్ సర్వే దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. రెండో దఫాలో ఫీవర్ సర్వేకు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. కేంద్రం ప్రభుత్వం సైతం దేశవ్యాప్తంగా ఫీవర్ సర్వే చేపట్టింది. మూడో దఫాలోనూ ఈ ఫీవర్ సర్వే కొనసాగుతుంది. వారం రోజులుగా సాగుతున్న సర్వేలో 77 లక్షల 33 వేల 427 ఇళ్లను పరిశీలించాం. ఇంటింటికీ వెళ్లి సిబ్బంది పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటికీ 3 లక్షల 45 వేల 951 కిట్లు అందించాం. రోజూ లక్షకు పైగా పరీక్షలు చేస్తున్నాం. సుమారు 2 కోట్ల కరోనా పరీక్షలకిట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. కోటి హోం ఐసోలేషన్ కిట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు 4 లక్షల వరకు మాత్రమే వినియోగించారు. బూస్టర్​డోస్ సమయం 9 నెలల నుంచి 3 నెలలకు తగ్గించాలని కేంద్రానికి లేఖ రాసినా.. ఇప్పటి వరకు స్పందన లేదు. 60 ఏళ్లకు పైబడ్డ వారికే కాకుండా అందరికీ బూస్టర్ డోస్ ఇవ్వాలి." -హరీశ్​రావు, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి

జ్వర సర్వే నిర్వహణ పట్ల కేంద్ర మంత్రి హర్షం..

రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి, కట్టడిపై వివిధ రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో కేంద్ర మంత్రి మాండవీయ చేపట్టిన వీడియో కాన్ఫెరెన్స్‌లో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. ఖమ్మం కలెక్టరేట్ నుంచి కాన్ఫరెన్స్‌కు హాజరైన మంత్రి... కరోనా కట్టడి చర్యల్లో భాగంగా రాష్ట్రంలో చేపట్టిన జ్వర సర్వే గురించి కేంద్ర మంత్రికి వివరించారు. జ్వర సర్వే నిర్వహణ పట్ల హర్షం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి మన్సుక్ మాండవీయ... అన్ని రాష్ట్రాల్లో ఈ మేరకు సర్వే నిర్వహించేలా చర్యలు చేపడతామని ప్రకటించారు. ఈసీఆర్‌పీ కింద పెండింగ్‌లో ఉన్న నిధులను మంజూరు చేయాలని మంత్రి హరీశ్‌రావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కాన్ఫరెన్స్‌లో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, కేరళ, లక్షద్వీప్, అండమాన్ నికోబార్, పుదుచ్చేరి రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులు, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

  • సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

పోలీసుల భద్రతా వైఫల్యం..

మరోవైపు... మంత్రి హరీశ్ రావు పర్యటనలో పోలీసుల భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఆస్పత్రి నుంచి సమీక్ష సమావేశానికి వెళ్లేసమయంలో భాజపా కార్యకర్తలు ఒక్కసారిగా మంత్రి కారుపైకి దూసుకెళ్లారు. హరీశ్​రావు కారుపై పడి ఆందోళన చేపట్టారు. వెంటనే ఉద్యోగ నియామక ప్రకటన చేపట్టాలని డిమాండ్ చేశారు. భాజపా కార్యకర్తల్ని పోలీసులు ఏమాత్రం నిలువరించలేకపోవడంపై పోలీసు ఉన్నతాధికారుల తీరుపై మంత్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.