ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు...కేంద్రానికి కేటీఆర్ 5 లేఖలు.. KTR Letter To Nirmala Seetharaman: వచ్చే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో రాష్ట్రానికి అధిక నిధులు కేటాయించాలని కోరుతూ.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు మంత్రి కేటీఆర్ ఐదు వేర్వేరు లేఖలు రాశారు. తెలంగాణలో పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన.. ఇతర కార్యక్రమాల కోసం కేంద్ర బడ్జెట్లో నిధులను కేటాయించాలని కోరారు.సీఎం కేసీఆర్కు యూఎస్పీసీ జాక్టో లేఖ.. USPC letter to CM KCR: సీఎం కేసీఆర్కు ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి- యూఎస్పీసీ జాక్టో లేఖ రాసింది. బదిలీల విషయమై ఉద్యోగుల అభ్యంతరాలు పట్టించుకోకుండా కేటాయింపులు జరిగాయని లేఖలో ఆరోపించింది. 317 జీవోలోని లోపాలు సవరించి.. ఉద్యోగ నియామకాల్లో స్థానికతను కాపాడాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది.రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి.. Telangana New Corona Cases: తెలంగాణలో కరోనా వైరస్ ఉద్ధృతి ఏ మాత్రం తగ్గడం లేదు. రోజువారీ కేసులు భారీగానే నమోదవుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో కొత్తగా 3,603 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారిన పడి మరొకరు ప్రాణాలొదిలారు. వైరస్ నుంచి మరో 2,707 మంది బాధితులు కోలుకున్నారు.వెంకయ్యకు మరోసారి కరోనా.. Vice president Venkaiah Naidu Corona: ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుకు కరోనా పాజిటివ్గా నిర్ధరణ అయింది. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న ఆయన.. స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.కర్ణాటకలో కొవిడ్ విజృంభణ.. Covid Cases in India: పలు రాష్ట్రాల్లో రోజువారీ కరోనా కేసుల్లో భారీగా పెరుగుదల నమోదైంది. కర్ణాటకలో ఒక్కరోజే 50 వేలకుపైగా కేసులు బయటపడ్డాయి. అయితే దిల్లీలో కరోనా 10 వేల దిగువన నమోదయ్యాయి.నేతాజీ విగ్రహం.. భావితరాలకు స్ఫూర్తి Netaji hologram statue India Gate: ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్ర బోస్ హాలోగ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. నేతాజీ 125వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. నేతాజీ విగ్రహం.. ప్రజాస్వామ్య విలువల్ని గుర్తుచేస్తూ, భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు.త్వరలోనే మా మంత్రి అరెస్ట్.. Punjab Elections Kejriwal: దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి భాజపాపై విరుచుకుపడ్డారు. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కేంద్రం.. మరోసారి దర్యాప్తు సంస్థలను రంగంలోకి దించేందుకు చూస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే దిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ను అరెస్ట్ చేసేందుకు ఈడీ సిద్ధంగా ఉందని ఆరోపించారు.పిల్లలపై మంత్రి కుమారుని కాల్పులు.. Minister son gun fire: మంత్రి ఇంటి పక్కన ఉన్న మామిడి తోటలో పిల్లలంతా చేరి ఆటలు ఆడుకోవడం తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఆవేశంలో మంత్రి కుమారుడు తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపి, అనుచరులతో కలిసి దాడి చేయగా.. అనేక మంది గాయపడ్డారు.క్రికెట్లర్లలో పుష్ప మేనియా.. తగ్గేదేలే.. Cricketers Pushpa: ప్రస్తుతం ఎక్కడచూసినా 'పుష్ప' సినిమా పేరు మార్మోగుతోంది. ఐకాన్ స్టార్ అల్లూ అర్జున్ నటించిన ఈ సినిమాకు సినీప్రియులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు, స్టార్ క్రికెటర్లు కూడా ఫిదా అవుతున్నారు. ఈ సినిమాలో పాటలకు స్టెప్పులేస్తున్నారు. 'తగ్గేదేలే' అంటూ డైలాగ్లు చెప్తూ అభిమానులను అలరిస్తున్నారు. వాటికి సంబంధించిన వీడియోలను చూసేద్దాం..పెళ్లిపెద్దగా మారిన సాహో బ్యూటీ.. తన మేకప్ ఆర్టిస్ట్ పెళ్లిలో తెగ సందడి చేసింది హీరోయిన్ శ్రద్ధాకపూర్. పెళ్లి పెద్దగా వ్యవహరించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.