తెలంగాణ

telangana

Justice NV Ramana On Telugu: 'భాషా ఔన్నత్యానికి ప్రభుత్వాలు మద్దతు ఇవ్వడం లేదు'

By

Published : Dec 4, 2021, 9:28 PM IST

Justice NV Ramana On Telugu: ఘంటశాల శత జయంతి సందర్భంగా సంగమం ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్రభారతిలో ప్రత్యేకంగా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ ఎన్వీ రమణ... రవీంద్రభారతి ప్రాంగణంలోని ఘంటశాల విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో గాన కోకిల పి.సుశీలను ఘంటశాల శతజయంతి పురస్కారంతో ప్రత్యేకంగా సత్కరించారు.

Justice NV Ramana On Telugu language at ghantasala birth anniversary program
Justice NV Ramana On Telugu language at ghantasala birth anniversary program

Justice NV Ramana On Telugu: తెలుగు భాషా సంస్కృతులు క్రమంగా పడిపోతున్నాయని.. ప్రభుత్వాలు భాషా ఔన్నత్యానికి మద్దతు ఇవ్వడం లేదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. ఘంటశాల శత జయంతి సందర్భంగా సంగమం ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్రభారతిలో ప్రత్యేకంగా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ ఎన్వీ రమణ... రవీంద్రభారతి ప్రాంగణంలోని ఘంటశాల విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో గాన కోకిల పి.సుశీలను ఘంటశాల శతజయంతి పురస్కారంతో ప్రత్యేకంగా సత్కరించారు. ఈ సందర్భంగా వేదికపై 100 మంది చిన్నారులు ఆలపించిన ఘంటశాల పాటలు తనను బాల్యంలోకి తీసుకెళ్లాయన్నారు.

"ఘంటశాల పాటలు మన జీవితాలతో పెనవేసుకుపోయాయి. "తెలుగువీర లేవరా పాట" వింటే ఎంతో భావోద్వేగం కలుగుతుంది. అలాంటి గొప్ప గాయకుడున్న తెలుగు సినిమా రంగంలో తెలుగు భాష రోజురోజుకు దిగజారిపోతుంది. తొలినాళ్లలో సినిమా రంగం ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహారించేది. వ్యాపారాత్మకంగా కాకుండా సామాజిక స్పృహాతో తీసే చిత్రాలనే ప్రజల్లో చర్చించుకుంటారు. నటీనటులు తెలుగు ఉచ్చారణపై ప్రత్యేక శ్రద్ద చూపాలి."

-జస్టిస్​ ఎన్వీ రమణ

అనంతరం ఇదే వేదికపై ఎన్టీఆర్​ను మన దేశం చిత్రంతో నటుడిగా పరిచయం చేసిన నటి, నిర్మాత కృష్ణవేణితో పాటు పలువురు సినీరంగ ప్రముఖులు, గాయనీగాయకులను జస్టిస్ ఎన్వీ రమణ సత్కరించారు. ఈ వేడుకల్లో సీనియర్ నటుడు మురళీమోహన్, దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, ఏపీ మాజీ ఉపసభాపతి మడ్డలి బుద్దప్రసాద్, రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఆర్. నారాయణమూర్తి, మంజుభార్గవి పాల్గొన్నారు.

ఘంటశాల, సుశీల, ఎన్టీఆర్​లకు భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారాలను ప్రదానం చేయాలని నటుడు ఆర్. నారాయణమూర్తి విజ్ఞప్తి చేశారు. గానకోకిల పి.సుశీల తన మనసులోని మాటను బయటపెట్టారు. ప్రధాని నరేంద్రమోదీని కలిసి తెలుగులో మాట్లాడాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. వేదికపై శ్రీప్రఖ్యా ఆర్ట్స్, శ్రీలక్ష్మణాచారి మోమోరియల్ సంగీత పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు ఆలపించి ఘంటశాల గీతాలు ప్రేక్షకులను, అతిథులుగా విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details