తెలంగాణ

telangana

స్వల్పంగా పెరిగిన పసిడి ధర.. పడిపోయిన బిట్​కాయిన్​

By

Published : May 30, 2022, 11:14 AM IST

Gold Price: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.52,950గా ఉంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బిట్​ కాయిన్ విలువ పడిపోయింది.

gold rate
గోల్డ్ రేట్​

Gold Rate Today: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.52,950 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ.66,266గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయో చూద్దాం..

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ. 52,950గా ఉంది. కిలో వెండి ధర రూ.64,266 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.52,950 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.66,266గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,950గా ఉంది. కేజీ వెండి ధర రూ.66,266 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.52,950గా ఉంది. కేజీ వెండి ధర రూ.66,266 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..అంతర్జాతీయంగా స్పాట్​ గోల్డ్​ ధర స్థిరంగా ఉంది. ఔన్సు బంగారం 1862.50 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర.. ఔన్సుకు 22.24 డాలర్లుగా ఉంది.
ఇంధన ధరలు ఇలా..పెట్రోల్, డీజిల్ ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

Cryptocurrency Price in India: క్రిప్టోకరెన్సీల్లో.. బిట్​కాయిన్​ విలువ క్రితం రోజుతో పోల్చితే తగ్గింది.. ప్రస్తుతం రూ. 23,52,650 వద్ద ఉంది. ఇథీరియం, బినాన్స్​ కాయిన్​ మొదలైన ఇతర ప్రధాన క్రిప్టోకరెన్సీల ధరలు ఎలా ఉన్నాయంటే..

క్రిప్టోకరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.23,52,650
ఇథీరియం రూ.1,45,708
టెథర్ రూ.77.44
బినాన్స్​ కాయిన్ రూ.24,558
యూఎస్​డీ కాయిన్ రూ.82.45

ఇదీ చదవండి:'దేశంలో పెరిగిన నకిలీ నోట్లు'.. ప్రతిపక్షాలకు అస్త్రంగా ఆర్‌బీఐ నివేదిక

ABOUT THE AUTHOR

...view details