తెలంగాణ

telangana

ఫ్లాట్​గా బంగారం, వెండి.. ఏపీ, తెలంగాణలో ధరలు ఇలా..

By

Published : Jul 14, 2022, 10:18 AM IST

Gold Price Today: దేశంలో బంగారం, వెండి ధర స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల పసిడి.. కిలో వెండి ధరలు ఎంత ఉన్నాయంటే?

GOLD PRICE TODAY
GOLD PRICE TODAY

Gold Price Today: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. బుధవారంతో పోలిస్తే.. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.70 అధికమైంది. మరోవైపు, వెండి ధర సైతం స్వల్పంగా పెరిగింది. కేజీ వెండి రూ.20 మేర పెరిగింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

• Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.52,470గా ఉంది. కిలో వెండి ధర రూ.57,970 వద్ద కొనసాగుతోంది.
• Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.52,470 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.57,970గా ఉంది.
• Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,470గా ఉంది. కేజీ వెండి ధర రూ.57,970 వద్ద కొనసాగుతోంది.
• Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.52,470గా ఉంది. కేజీ వెండి ధర రూ.57,970 వద్ద కొనసాగుతోంది.
స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..:అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,730 డాలర్లు పలుకుతోంది. ఔన్సు వెండి ధర 19.11 డాలర్లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు:పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీ:బిట్​కాయిన్ విలువ స్వల్పంగా వృద్ధి చెందింది. ఒక్కో బిట్​కాయిన్ విలువ రూ.12,098 మేర పెరిగింది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.16,70,095 పలుకుతోంది. ఇథీరియం రూ.వెయ్యి మేర పెరిగింది. ప్రస్తుతం రూ.91,500 వద్ద కొనసాగుతోంది.

క్రిప్టోకరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.16,70,095
ఇథీరియం రూ.91,500
టెథర్ రూ.83.12
బినాన్స్​ కాయిన్ రూ.19,165
యూఎస్​డీ కాయిన్ రూ.82.90

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలున్నప్పటికీ దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 259 పాయింట్ల లాభంతో 53,773 వద్ద, నిఫ్టీ 74 పాయింట్లు లాభపడి 16,041 వద్ద ట్రేడవుతున్నాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రికార్డు కనిష్ఠమైన రూ.79.76 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో సన్‌ఫార్మా, డాక్టర్‌ రెడ్డీస్‌, టైటన్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, హెచ్‌యూఎల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌, హెచ్‌డీఎఫ్‌సీ, నెస్లే ఇండియా, రిలయన్స్‌, మారుతీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, ఎంఅండ్‌ఎం, టెక్‌ మహీంద్రా, ఎస్‌బీఐ షేర్లు నష్టపోతున్న వాటి జాబితాలో ఉన్నాయి.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details