తెలంగాణ

telangana

Petrol GST news: అప్పుడు లీటర్ పెట్రోల్ రూ.56, డీజిల్ రూ.50!

By

Published : Sep 17, 2021, 2:17 PM IST

Updated : Sep 17, 2021, 2:46 PM IST

పెట్రోల్ (Petrol GST news)​, డీజిల్​ సహా ఇతర పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్​టీ కిందకు తేవడమే అజెండాగా.. కౌన్సిల్​(GST council meeting) సమావేశమైంది. అయితే.. వీటిని జీఎస్​టీ కిందకు తెస్తే ఏమౌతుంది? ధరలేమన్నా తగ్గుతాయా?

జీఎస్​టీ కౌన్సిల్ (GST news today) సమావేశంలో పెట్రోల్ (Petrol GST news), డీజిల్‌ను జీఎస్​టీ కిందకు తేవడం గురించి ప్రతిపాదన పెట్టనున్నట్టు తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల పెట్రోల్, డీజిల్ ధరల్లో భారీ మార్పు రావొచ్చని ప్రజలు నమ్ముతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా దీని గురించి రాష్ట్రాలతో ఎప్పటి నుంచో చర్చిస్తోంది. అయితే, అసలు ఎంత వరకు ధరలు తగ్గుతాయి, నష్టాలు ఏమైనా ఉన్నాయా ? వంటి విషయాలను చూద్దాం.

ప్రస్తుత పెట్రోల్, డీజిల్ ధరల్లో పన్నులు ఎంత?

పెట్రోల్ బేస్ ధర రూ. 40 కి దగ్గరలో ఉంటుంది. దీని మీద వ్యాట్, డీలర్ కమిషన్, ఎక్సైజ్‌ డ్యూటీ వంటి అనేక ఛార్జీలు రూ.60 కి పైగా ఉంటాయి. ఈ పన్నుల్లో కొంత కేంద్రానికి, కొంత రాష్ట్రాలకు చేరతాయి. దీనితో కొనుగోలు ధర పెట్రోల్ బంకు వద్ద ప్రస్తుతం రూ.100 దాటేసింది. ఇదే విధంగా డీజిల్ కూడా రూ.100 కి చేరువలో ఉంది. రాష్ట్రాల పన్నుల్లో వ్యత్యాసం ఉన్నందున ధరల్లో కూడా తేడా ఉంటోంది.

జీఎస్​టీకిందకి తెస్తే ఎంత తగ్గుతుంది?

జీఎస్​టీలో అనేక శ్లాబులు ఉన్న విషయం తెలిసిందే. ఒకవేళ గరిష్ఠ శ్లాబ్‌ (GST slabs in India) అయినా 28 శాతం పరిధిలోకి పెట్రోల్, డీజిల్​ని (GST council meeting today) చేరిస్తే ధరలు ఎంత వరకు తగ్గుతాయి అనేది చూద్దాం! బేస్ ధర మీద 28 శాతం జీఎస్​టీ అనుకున్నట్టయితే సుమారుగా రూ.11 - 12 అనుకోవచ్చు. దీనికి డీలర్ కమిషన్ రూ.3-4 జోడిస్తే, చివరిగా పెట్రోల్ ధర రూ. 55-56 వరకు ఉండవచ్చు. అలాగే, డీజిల్ రూ.50 కి దిగువన ఉండే అవకాశం ఉంటుంది.

రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకుంటాయా?

జీఎస్​టీలోకి పెట్రోల్, డీజిల్​ని(Petrol GST news) తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వాలని ఒప్పించడమే అతి పెద్ద సమస్య. ఏటా రూ.వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోయే అవకాశం ఉన్నందున కొన్ని రాష్ట్రాలు దీనికి వ్యతిరేకంగా ఉన్నట్టు తెలుస్తోంది. పన్నుల ద్వారా కేంద్ర, రాష్ట్రాలు ఏడాదికి రూ. 5 ల‌క్ష‌ల‌ కోట్ల వరకు వసూలు చేస్తుంటాయి. ఇందులో రాష్ట్రాల వాటా సుమారుగా రూ. 2 ల‌క్ష‌ల‌ కోట్లు. కొంత జీఎస్​టీ ద్వారా రాష్ట్రాలకు తిరిగి వ‌చ్చినప్పటికీ ఇప్పటి పన్నులతో పోలిస్తే అది చాలా తక్కువనే చెప్పాలి.

జీఎస్​టీలోకి తేవడం వల్ల అనేక వస్తువుల, సేవల ధరలు తగ్గినట్టు మనం ఇది వరకే చూశాం. అదే విధంగా పెట్రోల్, డీజిల్​ని కూడా ఇందులో చేరిస్తే సుమారుగా 50 శాతం వరకు ధరలు తగ్గవచ్చని మనకి తెలుస్తోంది. రాష్ట్రాలని ఒప్పించి కేంద్రం ఇలా తీసుకురాగలదా అనేది చూడాల్సి ఉంది!

ఇవీ చూడండి: ఆరేళ్లలో రూ.5 లక్షల కోట్ల మొండి బకాయిలు వసూలు!

Telecom news: ''ఒకే జట్టుగా టెలికాం..! అంబానీతో మాట్లాడతా''

Last Updated :Sep 17, 2021, 2:46 PM IST

ABOUT THE AUTHOR

...view details