తెలంగాణ

telangana

ఘోర ప్రమాదం: ఆరుగురు రైతులు మృతి

By

Published : May 20, 2020, 8:01 AM IST

Updated : May 20, 2020, 9:32 AM IST

6 farmers killed and 1 injured in UP
ఘోర ప్రమాదం: ఆరుగురు రైతులు మృతి

09:31 May 20

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఎటావా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ట్రక్కులు ఢీకొని ఆరుగురు రైతులు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన రైతును సైఫై మెడికల్‌ కాలేజీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులు మార్కెట్‌లో పండ్లు విక్రయించడానికి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని జిల్లా ఎస్పీ ఆర్.సింగ్‌  తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో రైతులు మృతి చెందిన ఘటనపై ఉత్తర్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ దిగ్బ్రింతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం అందించనున్నట్లు ప్రకటించారు.

08:48 May 20

ఘోర ప్రమాదం: ఆరుగురు రైతులు మృతి

ప్రమాదంపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబానికి రూ.2 లక్షలు, గాయపడినవారికి రూ.50,000 పరిహారం ప్రకటించారు.

07:57 May 20

ఘోర ప్రమాదం: ఆరుగురు రైతులు మృతి

ఉత్తర్​ప్రదేశ్​లో ఘోర ప్రమాదం జరిగింది. ఇటావా నగరం ఫ్రెండ్స్​ కాలనీ ప్రాంతంలో రెండు ట్రక్కులు ఢీ కొన్నాయి. ఘటనలో ఆరుగురు రైతులు మృతి చెందారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. అతడ్ని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. రైతులు పండ్ల మార్కెట్​కు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని ఎస్​పీ తెలిపారు.

Last Updated :May 20, 2020, 9:32 AM IST

ABOUT THE AUTHOR

...view details