తెలంగాణ

telangana

యాదాద్రీశుడికి కన్నుల పండువగా లక్ష పుష్పార్చన - పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు - Laksha Pushparchana in Yadadri

By ETV Bharat Telangana Team

Published : Apr 19, 2024, 2:08 PM IST

Yadadri Sri Lakshmi Narasimha Swamy Temple : ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ ఆలయంలో ఘనంగా లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు సుమారు గంట పాటు ప్రధాన ఆలయంలో ముఖ మండపంలో లక్ష పుష్పార్చన పూజలు, పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం చేపట్టారు. ఆలయ అర్చకులు వేద పండితుల, వేద మంత్రోచ్చారణలతో సన్నాయి మేళాల నడుమ ఈ ఉత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. లక్ష పుష్పార్చన పూజల్లో భక్తులకు ఆలయ విశిష్టతను ఆలయ ప్రధాన అర్చకులు తెలియజేశారు. 

Laksha Pushparchana in Yadadri Temple : ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పూజలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. మరోవైపు ఆలయంలో భక్తుల రద్ధీ అధికంగా ఉంది. దీంతో ఉచిత దర్శనానికి దాదాపు రెండు నుంచి మూడు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు గంట నుంచి గంటన్నర సమయం పట్టింది. లడ్డు ప్రసాదం కౌంటర్లు, నిత్యా కళ్యాణం, పుష్కరిణి, వాహనాల పార్కింగ్ వద్ద భక్తుల సందడి నెలకొంది.

ABOUT THE AUTHOR

...view details