ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మన్యం జిల్లాలో గంజాయి కలకలం - రెండు బస్తాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు - ganja in manyam district

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 16, 2024, 9:28 PM IST

Illegal Ganja in Parvathipuram Manyam District : పార్వతీపురం మన్యం జిల్లాలో గంజాయి పట్టుబడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఎన్నికల సమయంలో మన్యం పట్టణ నడిబొడ్డున ఎనిమిది కిలోలా గంజాయి పట్టుబడటంతో స్థానికంగా కలకలం రేగింది. పట్టణ పరిసర ప్రాంతాల్లో  ఇప్పటివరకు అక్రమంగా సారా విక్రయాలు జరుగుతున్నాయి తప్ప గంజాయి కేసులు బయటపడలేదు. తాజాగా గంజాయి పట్టుబడటంతో ఈ సంస్కృతి కూడా పాకిందని జిల్లా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అది కూడా పోలీస్ స్టేషన్​కు కూతవేటు దూరంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నగరంలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారంతో మాదిగ వీధిలో నివాసం ఉంటున్న నిడగంటి జ్యోతి ఇంటిని ఈరోజు పోలీసులు సోదా చేశారు.

ఈ తనిఖీల్లో ఒక్కో బస్తాలో నాలుగు కిలోల గంజాయి చొప్పున రెండు బస్తాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం జ్యోతితో పాటు వెంకటేష్​ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ గంజాయిని ఒడిస్సా నుంచి వెంకటేష్ తీసుకువచ్చి జ్యోతికి అందిస్తున్నాడు. ఆమె చిన్న చిన్న పొట్లాలు కట్టి ఒక్కోక్కటి 100 రూపాయలు చొప్పున అమ్ముతుంది. ఈ కేసుపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ కృష్ణారావు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details