తెలంగాణ

telangana

LIVE : నిజామాబాద్ జన జాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి - ప్రత్యక్ష ప్రసారం - Revanth Campaign in Nizamabad

By ETV Bharat Telangana Team

Published : Apr 22, 2024, 3:36 PM IST

Updated : Apr 22, 2024, 4:17 PM IST

CM Revanth Reddy Campaign In Nizamabad LIVE : రాష్ట్రంలోని అత్యధిక ఎంపీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా అధికార కాంగ్రెస్‌ పార్టీ పావులు కదుపుతోంది. మిషన్‌-15 పేరుతో ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. అభ్యర్థుల తరఫున ప్రచారం చేసి ప్రభుత్వ పథకాల అమలు వివరిస్తున్నారు. ఇవాళ ఒక్కరోజే ఏకంగా మూడు నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు.ఆదిలాబాద్, నిజామాబాద్, మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గాల్లో రేవంత్ పర్యటన సాగుతోంది. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. ఈ క్రమంలోనే ఆదిలాబాద్ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం నిజామాబాజ్​ జన జాతర సభలో పాల్గొన్నారు. ఆ నియోజకవర్గం ఎంపీ అభ్యర్థి జీవన్​రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు, ఇతర నాయకులు పాల్గొన్నారు. అనంతరం మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం బహిరంగ సభల్లో సీఎం పాల్గొంటారు. 
Last Updated : Apr 22, 2024, 4:17 PM IST

ABOUT THE AUTHOR

...view details