Road Accident At Prakasam Naidupalem Highway :ఎంతో ఘనంగా కుమార్తె వివాహం చేసి బంధువులతో సంతోషంగా తిరిగివస్తున్న తల్లిని, బంధువులను మృత్యువు కబళించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, డ్రైవర్తో సహా ముగ్గురు తీవ్రగాయాలుపాలయ్యారు. డ్రైవర్ నిద్రమత్తు వల్ల కారు అదుపుతప్పి బోల్తాపడి ప్రమాదంజరిగిందని పోలీసులు వెల్లడించారు.
Three Were Died Three severely Injured: పోలీసులు తెలిపిన వివరాలు మేరకు ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం నాయుడుపాలెం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెలంగాణలోని పాల్వంచలో కుమార్తె వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఒంగోలు రిమ్స్కు (RIMS) తరలించామని వెల్లడించారు. కాసేపట్లో స్వగ్రామానికి చేరుకోవాల్సి ఉండగా ఈ ప్రమాదం జరగడంతో ఆ ప్రాంతమంతా విషాదఛాయలు అలుముకున్నాయి.
బుధవారం సాయంత్రం వివాహానికి హజరై తిరిగి పెళ్లి కారులోనే బంధువులు, పెళ్లి కుమార్తె తల్లి అరుణ స్వగ్రామానికి పయనమయ్యారు. ఈరోజు ఉదయం 6.30 -7 గంటల సమయంలో నాయుడుపాలెం జాతీయ రహదారి వద్ద ప్రమాదం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. డ్రైవర్ నిద్రమత్తు వల్ల ప్రమాదం జరిగిందని వారు తెలిపారు. ముగ్గురు మహిళలు అక్కడికక్కడే చనిపోవటంతో మిగిలిన ముగ్గురు వినోద్ (డ్రైవర్), వేణు, అభిలాష్ (బాలుడు)లను సహాయక చర్యలు చేపట్టి హుటాహుటిన ఆసుపత్రికి తరలించామని వెల్లడించారు.