పెట్రోల్ బంకు వద్ద కారులో మంటలు - స్థానికుల అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం

By ETV Bharat Telangana Team

Published : Mar 19, 2024, 7:27 PM IST

thumbnail

Fire Catches Car In Hyderabad : హైదరాబాద్ నగర శివారు చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ కారులో మంటలు చెలరేగిన ఘటన కలకలం రేపింది. గచ్చిబౌలి నుంచి లింగపల్లికి కొందరు ప్రయాణికులు కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గుల్‌మోహర్‌ పార్కు వద్ద గల హెచ్‌పీ పెట్రోల్‌ బంక్‌కు సమీపంలోకి కారు రాగానే అందులోంచి మంటలు చేలరేగాయి. దీనిని గమనించిన స్థానికులు, పెట్రోల్​ బంకు సిబ్బంది వెంటనే మంటలను ఆర్పివేసే ప్రయత్నం చేయడంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే తేరుకున్న కారు డ్రైవర్‌తో పాటు అందులో ఉన్న ప్రయాణికులు బయటకు వచ్చి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

Electric Scooter Fire Accident In Siddipet : మరోవైపు సిద్దిపేట పట్టణంలోని మోడల్ బస్టాండ్ ఎదురుగా ఒక్కసారిగా ఎలక్ట్రిక్ బైక్​లో మంటలు చెలరేగిన ఘటన కలకలం రేపింది. వాహనదారుడు అప్రమత్తమవ్వడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దీనిని గమనించిన ట్రాఫిక్​ పోలీసులు అప్రమత్తమై మంటలు ఆర్పివేయడం వల్ల ప్రమాదం తప్పింది. ఈ-బైక్​లో మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.