తెలంగాణ

telangana

రైతుల పేరిట బీఆర్ఎస్ దొంగ దీక్షలకు దిగింది : మంత్రి శ్రీధర్​ బాబు - Minister Sridhar babu on BRS Party

By ETV Bharat Telangana Team

Published : Apr 8, 2024, 9:51 PM IST

Minister Sridhar Babu Election Campaign in Peddapalli : రామగుండం జెన్‌కో పవర్‌ ప్లాంటు సామర్థ్యం పెంచాల్సి ఉందని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. రామగుండాన్ని మోడల్‌ కార్పొరేషన్‌గా తీర్చిదిద్దాలన్న మంత్రి, స్థానిక నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఈ ఎన్నిక ప్రతి కార్యకర్త, నాయకుడిదన్న శ్రీధర్‌బాబు, ఎంపీ ఎన్నికల్లో గడ్డం వంశీకృష్ణకు భారీ మెజార్టీ అందించాలని కోరారు.

Congress Election Campaign
Minister Sridhar Babu Election Campaign in Peddapalli

Minister Sridhar Babu Election Campaign in Peddapalli : కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి, ఓర్వలేని బీఆర్ఎస్ నాయకులు రైతులు పేరిట దొంగ దీక్ష చేస్తున్నారని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్​ బాబు విమర్శించారు. గోదావరిఖనిలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి హాజరైన మంత్రి, గులాబీ పార్టీపై(BRS Party) తీవ్రంగా విమర్శలు గుప్పించారు. పెద్దపల్లి ప్రాంతం పారిశ్రామికంగా మరింత వృద్ధి సాధించాలంటే కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణను గెలిపించాలన్నారు.

ప్రతి కార్యకర్త, నాయకుడిది ఈ ఎన్నిక : సింగరేణి కార్మికుల సమస్యలు, కేశోరాం సిమెంట్ విషయంలోను సమస్యలు పరిష్కరించేందుకు ఇక్కడి ఎమ్మెల్యే గతంలో ఎన్నో పోరాటాలు చేశారన్నారు. ఆయనకు మరింత బలంగా తయారు చేయాలన్న, జెన్కో విస్తరణ(Zen Co Expansion) పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్​కు మద్దతుగా వంశీను గెలిపించాలని కోరారు. ఈ ఎన్నిక ప్రతి కార్యకర్త, నాయకుడిదని మంత్రి పేర్కొన్నారు.

అందరి ఫోన్లు ట్యాప్ చేశారు - నిందితులందరూ బయటకు వస్తారు : శ్రీధర్ బాబు - lok sabha elections 2024

"యువకులు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించాలని, వంశీను పార్టీ ఎంపిక చేసింది. ప్రజల సమస్యలు తెలుసుకుంటా సమస్యలు పరిష్కరిస్తా అంటున్న ఎంపీ అభ్యర్థి వంశీని ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. పార్టీలో అంతర్గతంగా చిన్నచిన్న సమస్యలు ఉన్నా మంచి నాయకుణ్ని అందించాల్సిన అవసరం ఉందనే పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది."-శ్రీధర్​ బాబు, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి

గతంలో సింగరేణి ప్రాంతంలో 27000 మందికి సింగరేణి పట్టాలు కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. అంతే కాకుండా మిగిలి ఉన్న 3000 పట్టాల కోసం ప్రయత్నం చేస్తామన్నారు. సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు(Singareni Contract Workers) వేతనం విషయంలో రాజ్ ఠాకూర్ ఎన్నో ప్రయత్నాలు చేశారని, ఎన్నికల ప్రక్రియ ముగిశాక తప్పకుండా వాటికోసం యత్నిస్తానని శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల విషయంలో అయిదు ప్రధాన హామీలు అమలు చేశామని వివరించారు.

Minister Sridhar Babu Fires on BRS :గత ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ నాయకులు కొత్త ప్రభుత్వానికి కనీసం రెండేళ్లు సమయం ఇవ్వకుండా విమర్శలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు. గతంలో బీఆర్​ఎస్​ ప్రభుత్వం కాంగ్రెస్‌ శ్రేణులను ఇబ్బంది పెట్టిందని వ్యాఖ్యానించారు. గతంలో ధాన్యం కొనుగోళ్లలో(Grain Purchases) 100 కిలోలకు 14 కిలోల కోత విధిస్తుంటే, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఏమీ చేశారో సమాధానం చెప్పాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల పెద్దపల్లి జిల్లాకు ఒక్క నీటి చుక్క రాదన్న ఆయన, ఈ ప్రాంత రైతుల కోసం చిన్న కాళేశ్వరం, పత్తిపాక, పాలకుర్తి ఎత్తిపోతల పథకాలు నిర్మించి నీళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు.

రైతుల పేరిట బీఆర్ఎస్ దొంగ దీక్షలకు దిగింది : మంత్రి శ్రీధర్​ బాబు

గెలుపే లక్ష్యంగా లోక్​సభ ఎన్నికల ప్రచారం - విమర్శలు ప్రతి విమర్శలతో వేడెక్కుతున్న రాజకీయం - Lok Sabha Elections 2024

గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నాం : శ్రీధర్‌ బాబు - Lok Sabha Election 2024

ABOUT THE AUTHOR

...view details