తెలంగాణ

telangana

ఒక్క ఓటరు కోసం స్పెషల్​గా​ పోలింగ్ కేంద్రం- 2007 నుంచి ఇలానే! - Single Voter Polling Booth In India

By ETV Bharat Telugu Team

Published : Apr 10, 2024, 4:14 PM IST

Single Voter Polling Booth In India : ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమే. ఒక్క ఓటుతో ఫలితం తారుమారైన ఘటనలు ఎన్నో ఉన్నాయి అందుకే ఒకే ఒక్క ఓటరు ఉన్న చోట కూడా ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తోంది ఎన్నికల సంఘం. ఇలా ఆ ఒక్క ఓటరు కోసం 2007 నుంచి ప్రతి ఎన్నికలకు ఒక పోలింగ్​ బూత్​ను ఏర్పాటు చేస్తోంది. ఇంతకీ ఆ ఓటరు ఎవరు? ఆ పోలింగ్ కేంద్రం ఎక్కడో ఈ స్టోరీ చూద్దాం.

Single Voter Polling Booth In India
Single Voter Polling Booth In India

Single Voter Polling Booth In India : సాధారణంగా పోలింగ్​ బూత్​ దగ్గర ఉదయం నుంచే బారులు తీరే జనాలను చూస్తుంటాం. ఆ క్యూను చూసి విసుగు చెంది వెనుతిరిగే ఓటర్లు ఉంటారు. అలాంటిది గుజరాత్​లోని గిర్​ సోమ్​నాథ్​లో మాత్రం ఇందుకు భిన్నంగా ఓ పోలింగ్​ కేంద్రం ఏర్పాటు చేస్తోంది ఎన్నికల సంఘం. ఆ పోలింగ్​ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకునేది కేవలం ఒక్కరు మాత్రమే.

గిర్ సోమ్​నాథ్ వన్యప్రాణుల అభయారణ్యం లోపలున్న మారుమూల ప్రాంతం బనేజ్‌లో ఈ ఓటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు అధికారులు. అక్కడున్న శివాలయం పూజారి మహంత్ హరిదాస్​జీ ఈ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక్కడ ఓటింగ్‌ను నిర్వహించేందుకు, పర్యవేక్షించేందుకు ప్రత్యేక పోలింగ్ బృందాన్ని నియమించింది. బనేజ్ నుంచి జనావాస ప్రాంతం కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది. గిర్ సోమనాథ్ జిల్లాలోని ఈ ప్రాంతం జునాగఢ్ లోక్‌సభ స్థానం పరిధిలోకి వస్తుంది. 2007 సంవత్సరం నుంచే ప్రతి ఎన్నికలకు ఒకే ఒక్క ఓటరు కోసం బనేజ్‌లో ప్రత్యేక పోలింగ్‌ బూత్‌ను ఏర్పాటు చేస్తోంది. శివాలయం సమీపంలోని అటవీశాఖ కార్యాలయంలో పోలింగ్ బూత్​ ఏర్పాటు చేస్తున్నట్లు గుజరాత్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ తెలిపారు. గిర్ సోమనాథ్ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డి.డి.జడేజా ఇటీవల బనేజ్ పోలింగ్ బూత్‌ను సందర్శించి, ఏర్పాట్లపై సమీక్షించారు.

మొత్తం 11 ప్రాంతాల్లో
గుజరాత్‌లో మొత్తం 26 లోక్‌సభ స్థానాలకు మే 7న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. అర్హులైన ప్రతీ ఒక్కరు ఓటు వేసేలా చేసేందుకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా గుజరాత్‌లోని దట్టమైన అడవులు, చిన్నపాటి ద్వీపాలు సహా మొత్తం 11 మారుమూల ప్రాంతాల్లోనూ ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గిర్ సోమ్‌నాథ్ జిల్లాలోనే ఉన్న సాప్ నెస్ బిలియా అనే మరో మారుమూల ప్రాంతంలోనూ ప్రత్యేక పోలింగ్ బూత్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాంతంలో 23 మంది పురుషులు, 19 మంది మహిళా ఓటర్లు నివసిస్తున్నారు. ఇది కూడా గిర్ అడవి సమీపంలోని ప్రాంతం.

మోసపోయిన మహిళా లాయర్- నగ్నంగా వీడియో కాల్​, రూ.15లక్షలు లాస్- డ్రగ్స్ టెస్ట్ పేరుతో దోపిడీ - Woman Lawyer Case On Fake Officers

'మాకు అంత గొప్ప మనసు లేదులే!'- రామ్​దేవ్​ బాబాకు సుప్రీంకోర్టు బిగ్ షాక్ - Ramdev Baba Misleading Ads Case

ABOUT THE AUTHOR

...view details