తెలంగాణ

telangana

లోక్​సభ నాలుగో విడత పోలింగ్- 5గంటల వరకు 62.31% ఓటింగ్​ - Lok Sabha Elections 2024

By ETV Bharat Telugu Team

Published : May 13, 2024, 6:31 AM IST

Updated : May 13, 2024, 4:12 PM IST

Lok Sabha Elections 2024 phase 4 Live Updates : సార్వత్రిక సమరం నాలుగో విడత పోలింగ్‌ ముగిసింది. ఈ విడతలో 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని 96 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరిగింది.

Lok Sabha Elections 2024 phase 2 Live Updates
Lok Sabha Elections 2024 phase 2 Live Updates (ETV Bharat)

  • 06.00 PM

లోక్‌సభ నాలుగో దశ పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 62.31% ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్- 68.04%

బిహార్ - 54.14 %

జమ్ముకశ్మీర్ - 35.75%

ఝార్ఖండ్- 63.14%

మధ్యప్రదేశ్- 68.01%

మహారాష్ట్ర - 52.49%

ఒడిశా - 62.96%

తెలంగాణ- 61.16%

ఉత్తర్​ప్రదేశ్ - 56.35%

బంగాల్ - 75.66%

03.00 PM

ప్రస్తుతం కొనసాగుతున్న లోక్​సభ నాలుగో విడత పోలింగ్​లో మధ్యాహ్నం 3 గంటల వరకు 52.60% ఓటింగ్​ నమోదైంది.

  • ఆంధ్రప్రదేశ్- 55.49%
  • బిహార్- 45.23%
  • జమ్ముకశ్మీర్- 29.93%
  • ఝార్ఖండ్- 56.42%
  • మధ్యప్రదేశ్- 59.63%
  • మహారాష్ట్ర- 42.35%
  • ఒడిశా -52.91%
  • తెలంగాణ- 52.34%
  • ఉత్తరప్రదేశ్- 48.41%
  • బంగాల్- 66.05%
  • 01: 50 PM

ప్రస్తుతం కొనసాగుతున్న లోక్​సభ నాలుగో విడత పోలింగ్​లో మధ్యాహ్నం 1 గంటల వరకు 40.32% ఓటింగ్​ నమోదైంది.

  • ఆంధ్రప్రదేశ్- 40.26%
  • బిహార్- 34.44%
  • జమ్ముకశ్మీర్- 23.57%
  • ఝార్ఖండ్- 43.80%
  • మధ్యప్రదేశ్- 48.52%
  • మహారాష్ట్ర- 30.85%
  • ఒడిశా -39.30%
  • తెలంగాణ- 40.38%
  • ఉత్తర్​ప్రదేశ్- 39.68%
  • బంగాల్- 51.87%
  • 11:49 AM

ప్రస్తుతం కొనసాగుతున్న లోక్​సభ నాలుగో విడత పోలింగ్​లో ఉదయం 11 గంటల వరకు 24.87% ఓటింగ్​ నమోదైంది.

  • ఆంధ్రప్రదేశ్- 23.10%
  • బిహార్- 22.54%
  • జమ్ముకశ్మీర్- 14.94%
  • ఝార్ఖండ్- 27.40%
  • మధ్యప్రదేశ్- 32.38%
  • మహారాష్ట్ర- 17.51%
  • ఒడిశా -23.28%
  • తెలంగాణ- 24.31%
  • ఉత్తరప్రదేశ్- 27.12%
  • బంగాల్- 32.78%
  • 9:55 AM

ప్రస్తుతం కొనసాగుతున్న లోక్​సభ ఎన్నికలు నాలుగో విడత పోలింగ్​లో ఉదయం 9 గంటల వరకు 10.35% ఓటింగ్​ నమోదైంది.

  • ఆంధ్రప్రదేశ్- 9.05%
  • బీహార్- 10.18%
  • జమ్ముకశ్మీర్- 5.07%
  • ఝార్ఖండ్- 11.78%
  • మధ్యప్రదేశ్- 14.97%
  • మహారాష్ట్ర- 6.45%
  • ఒడిశా -9.23%
  • తెలంగాణ- 9.51%
  • ఉత్తరప్రదేశ్- 11.67%
  • బంగాల్- 15.24%
  • 8:15 AM

భారత ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం ప్రతి ఒక్కరి కర్తవ్యం అని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం అన్నారు. లోక్‌సభ ఎన్నికలు నాలుగో విడతలో 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 96 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. రికార్డు స్థాయిలో పోలింగ్ బూత్‌లకు హాజరు కావాలని ఓటర్లకు ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు.

  • 7:00 AM

పోలింగ్ ప్రారంభం
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా వివిధ రాష్ట్రాల్లో నాలుగో విడత పోలింగ్‌ ప్రారంభమైంది. ఈ విడతలో 10రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 96 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరుగుతోంది.

Lok Sabha Elections 2024 phase 4 Live Updates :లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో విడత పోలింగ్‌ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. నాల్గోవిడతలో 10రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 96లోక్‌సభ స్థానాల్లో ఓటింగ్‌ జరగనుంది. ఆంధ్రప్రదేశ్‌లో 25, తెలంగాణలో 17, ఉత్తర ప్రదేశ్‌లో 13, మహారాష్ట్రలో 11, మధ్యప్రదేశ్, బంగాల్‌లో 8 చొప్పున, బిహార్‌లో 5, ఒడిశా, ఝార్ఖండ్‌లో 4 చొప్పున, జమ్ముకశ్మీర్‌లో ఒక లోక్‌సభ నియోజకవర్గంలో పోలింగ్ జరగనుంది. ఒడిశాలో 147 అసెంబ్లీ నియోజకవర్గాలకు నాలుగు విడతల్లో ఓటింగ్ జరగనుంది. సోమవారం ఒడిశాలో 28 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది.

కీలక అభ్యర్థులు వీళ్లే
నాలుగో దశలో పలువురు ప్రముఖులు బరిలో ఉన్నారు. బిహార్​లోని బెగుసరాయ్​ నుంచి కేంద్ర మంత్రి గిరిరాజ్​సింగ్​ పోటీ చేస్తున్నారు. మరో కేంద్ర మంత్రి అర్జున్​ ముండా ఝార్ఖండ్​లోని ఖూంటీ స్థానంలో పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్​ సీనియర్​ నేత అధీర్​రంజన్ చౌధరీ బంగాల్​లోని బహరంపుర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్య వహిస్తున్నారు. బాలీవుడ్​ నటుడు శత్రుఘన్​సిన్హా తృణమూల్​ కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ ప్రస్తుతం కన్నౌజ్‌ నుంచి బరిలో నిలిచారు.

Last Updated : May 13, 2024, 4:12 PM IST

ABOUT THE AUTHOR

...view details