రోడ్డు దాటుతూ కరెంట్​ స్తంభాన్ని తాకి మహిళ మృతి.. విహార యాత్రకు వెళ్తుండగా ప్రమాదం..

By

Published : Jun 25, 2023, 5:58 PM IST

thumbnail

వర్షంతో తడిచిన కరెంటు స్తంభాన్ని తాకి ఓ మహిళ మృతి చెందిన ఘటన దిల్లీ రైల్వేస్టేషన్‌ సమీపంలో జరిగింది. రైల్వే స్టేషన్​కు వెళ్లే క్రమంలో అదుపుతప్పి కరెంట్ స్తంభాన్ని పట్టుకోవడం వల్ల మహిళ ప్రాణాలు కోల్పోయింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న దిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులతో పాటు రైల్వేశాఖతో కూడా విచారణ చేపట్టింది.  

ఇదీ జరిగింది
దిల్లీ ప్రీతి విహార్​కు చెందిన సాక్షి అహుజ అనే మహిళ ఛండీగఢ్​ వెళ్లేందుకు.. ఉదయం ఐదున్నర సమయంలో మరో ఇద్దరు మహిళలు, ముగ్గురు పిల్లలతో కలిసి రైల్వేస్టేషన్‌ సమీపానికి చేరుకుంది. రోడ్లపై నీరు నిలిచిపోవడం వల్ల వాటిని దాటే ప్రయత్నంలో పక్కనే ఉన్న కరెంటు స్తంభాన్ని తాకింది. దీంతో షాక్​కు గురైన ఆమె అక్కడే కుప్పకూలింది. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాక్షి మృతి చెందారు. ఆ కరెంటు స్తంభం వద్ద ప్లాస్టిక్‌ తొడుగు లేని కరెంటు వైర్లు వేలాడుతూ కనిపించాయి. సాక్షి అహుజకు ఇద్దరు పిల్లలు ఉండగా.. భర్త గురుగ్రామ్​లోని ఓ సంస్థలో పనిచేస్తున్నారు. నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది మృతురాలి సోదరి మధ్వి చోప్రా. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.