తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ మరోసారి కన్నేసింది : బోయినపల్లి వినోద్​ కుమార్​

By ETV Bharat Telangana Team

Published : Nov 13, 2023, 5:14 PM IST

thumbnail

 Vinodkumar Comments On Congress : హైదరాబాద్ నగరంలో కల్లోలం సృష్టించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై మరోసారి కన్నేసిందని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ విమర్శించారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం షానగర్​లో నియోజకవర్గ బూత్ అధ్యక్షుల సమావేశంలో వినోద్​ ప్రసంగించారు. బీఆర్​ఎస్​ పాలనలో హైదరాబాద్​లో ఒక్కరోజు కూడా కర్ఫ్యు పరిస్థితి లేదని వినోద్​ కుమార్​ తెలిపారు. కాంగ్రెస్​ చేతికి అధికారం ఇస్తే రాష్ట్ర పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా అవుతుందని వినోద్​ కుమార్​ ఎద్దేవా చేశారు.

Election campaign In Telangana 2023 : రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోవాలంటే బీఆర్​ఎస్​కు మరో ఐదేళ్లు చాలా కీలకం అన్నారు. కాంగ్రెస్ పాలనలో ముఖ్యమంత్రిని మార్చేందుకు అనేక హత్యలు జరిగాయని తాము కళ్లారా చూసామని అన్నారు. రాష్ట్రంలో సుస్థిర అభివృద్ధి సాధించేందుకు బీఆర్ఎస్​కు మరోసారి అవకాశం కల్పించాలని కోరారు. చొప్పదండి నియోజకవర్గం నుంచి బీఆర్​ఎస్​ అభ్యర్ధి సుంకె రవిశంకర్ సహా తదితర పార్టీ నాయకులు హాజరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.