5,16,108 రుద్రాక్షలతో శివలింగం తయారీ.. వారి కోసమేనట!

By

Published : Feb 17, 2023, 10:48 PM IST

Updated : Feb 18, 2023, 7:02 AM IST

thumbnail

కర్ణాటకలోని మైసూర్​లో 5,16,108 రుద్రాక్షలతో 21 అడుగుల శివలింగాన్ని తయారు చేశారు. బ్రహ్మ కుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయంలో ఈ శివలింగ ప్రతిమను ఏర్పాటు చేశారు. శివలింగం చుట్టు కృతిమ కైలాస పర్వతాన్ని కూడా నిర్మించారు. శివరాత్రి సందర్భంగా ప్రతిమను తయారు చేసినట్లు నిర్వహకులు బీకే రంగనాథ్​ తెలిపారు. ​శివలింగాన్ని దర్శించుకునేందుకు భక్తులందరికీ అవకాశం కల్పిసున్నట్లు రంగనాథ్ వెల్లడించారు. ఎవరైతే హిమాలయాలు, కాశీ, కేదారి​నాథ్​ వెళ్లలేకపోతారో వారి కోసమే ఈ శివలింగాన్ని తయారు చేసినట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి 22 వరకు ఉచితంగానే భక్తులు దర్శనం చేసుకోవచ్చని రంగనాథ్ తెలిపారు. కాగా 50 మంది కార్మికులు.. వారం రోజుల పాటు శ్రమించి రుద్రాక్ష శివలింగాన్ని రూపొందించినట్లు ఆయన వెల్లడించారు. 

Last Updated : Feb 18, 2023, 7:02 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.