Viral Video Road Accident in Hyderabad : ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు వ్యక్తి మృతి.. సీసీటీవీ ఫుటేజ్​ వైరల్​

By

Published : Aug 18, 2023, 7:08 PM IST

thumbnail

RTC Bus Hit Bike at Rahamathnagar : ద్విచక్రవాహనాన్ని.. ఆర్టీసీ బస్సు​ ఢీకొని ఓ వ్యక్తి మృతువాత పడిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. మధురానగర్ పోలీస్​స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో(road accident) ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలు వైరల్​గా మారాయి. రహమత్​నగర్ సర్కిల్ వద్ద బోరబండ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ద్విచక్ర వాహనాదారుడు ప్రమాదస్థలిలోనే మరణించాడు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవరు, కండక్టర్‌ పరారైనట్లు ప్రయాణికులు తెలిపారు. ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి.. మల్లేశ్​ s/oపెంటయ్యగా గుర్తించారు. మృతుడు స్థానికంగా పండ్ల వ్యాపారం చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. రహమాత్​నగర్​ డివిజన్​లోని కార్మికనగర్​ ఎన్జీటిలో నివాసం ఉంటున్నట్లుగా తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి ముఖ్య కారణం.. అతివేగమేనని స్థానికులు పేర్కొంటున్నారు. రోడ్డు ప్రమాదంతో యూసుఫ్​గూడ వద్ద ట్రాఫిక్​కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.