Prathidwani : ఎన్నికల పోరు తరుణం.. పార్టీల సన్నద్ధత

By ETV Bharat Telangana Team

Published : Oct 5, 2023, 10:48 PM IST

thumbnail

Prathidwani Debate on Telangana Assembly Elections 2023 : రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. అసెంబ్లీ ఎలక్షన్లకు ఈసీ ఏర్పాట్లన్నీ చేసుకుంటూ వెళిపోతోంది. షెడ్యూల్ కూడా రేపో, మాపో అన్నట్లుగానే ఉంది. తాజాగా రాష్ట్ర ఓటర్ల జాబితాను సైతం ప్రకటించింది. రాష్ట్రంలో ఎన్నికల బరిలో నిలుస్తున్న ప్రధాన పార్టీలైన బీఆర్​ఎస్​, కాంగ్రెస్​, బీజేపీ.. ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. సభలు, సమావేశాలతో నిర్వహిస్తూ.. తమ ప్రత్యర్థులపై మాటల దాడి చేస్తూ ఓటర్ల నాడీ పట్టే పనిలో నిమగ్నమయ్యాయి. ముఖ్యంగా 

CEC on Telangana Elections 2023 : బీఆర్​ఎస్​.. ఒక అడుగు ముందుకేసి దాదాపు అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను సైతం ప్రకటించింది. మంత్రి హరీశ్​రావు, కేటీఆర్​ అన్ని తామైనట్లుగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక కాంగ్రెస్​ ఇక అభ్యర్థులను ప్రకటించలేదు. అయినప్పటికీ తుక్కుగూడ నిర్వహించిన సభలో ప్రకటించిన హామీలతో.. కాంగ్రెస్​ శ్రేణుల్లో నూతనోత్సహం నెలకొంది. బీజేపీ కూడా జాతీయస్థాయి నాయకులు సభలు నిర్వహిస్తూ.. ఓటర్లను ప్రసన్నం చేసకునే పనిలో పడ్డారు. ఈ తరుణంలో ఎన్నికల్లో ధనం, మద్యం ప్రవాహన్ని అడ్డుకోవడం ఎన్నికల కమిషన్​కు కత్తిమీదే సాము వంటిదేనని చెప్పాలి. మరి రాష్ట్రంలో ఎన్నికల వేళ పార్టీల సన్నద్ధత.. పోటీ ఎలా ఉండబోతోంది. ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకోకుండా ఈసీ సఫలీకృతం కానుందా? ఇదే నేటి ప్రతిధ్వని

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.