Prathidwani : మెగా "ఢీ"ఎస్సీ.. పోస్టుల సంఖ్య పెంచాలంటూ అభ్యర్థుల ఆందోళనలు

By ETV Bharat Telangana Team

Published : Aug 30, 2023, 9:50 PM IST

thumbnail

Prathidwani : నిరుద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఇటీవలే సర్కారు పచ్చజెండా ఊపింది. టీఎస్​పీఎస్సీ ద్వారా కాకుండా గతంలో మాదిరి జిల్లా ఎంపిక కమిటీలు(DSC) ఈ నియామకాలు చేపడతామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. 

TS DSC 2023 : స్వరాష్ట్రంలో రానున్న ఈ రెండవ డీఎస్సీ ద్వారా 5వేల 89 ఉపాధ్యాయ ఖాళీలు నింపనున్నట్లు ప్రకటించారు. ఈ సంఖ్యపైనే ఇప్పుడు వివాదం నెలకొంది. మాకు... డీఎస్సీ కాదు... మెగా డీఎస్సీ కావాలంటూ అభ్యర్థులు ఆందోళన బాట పట్టారు. హైదరాబాద్​లోని విద్యాశాఖ కార్యాలయం ఎదుట ఆందోళనలు చేపట్టారు. నిరుద్యోగులు. వారు చేపడుతున్న నిరసన కార్యక్రమాలు పలు ఉద్రిక్తతలకు దారి తీశాయి. పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్​ చేస్తున్నారు. అసలు ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీకి.. నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్న మెగా డీఎస్సీకి తేడా ఏమిటి? ప్రభుత్వం ఏం చేస్తే మేలు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.