97 మంది ఓటర్ల కోసం కొండల మధ్య పోలింగ్​ సిబ్బంది సాహసం

By

Published : Nov 11, 2022, 2:36 PM IST

Updated : Feb 3, 2023, 8:32 PM IST

thumbnail

హిమాచల్​ ప్రదేశ్​లోని కర్సోగ్​లో ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్​ సిబ్బంది పెద్ద సాహసమే చేశారు. 97 మంది ఓటర్లు ఉన్న మాగన్​ ప్రాంతానికి చేరుకునేందుకు సరైన రోడ్డు సదుపాయం లేకపోవడం వల్ల దాదాపు పర్వత ప్రాంతాల్లో నాలుగు కిలోమీటర్లు ఓటింగ్ యంత్రాలు మోసుకుంటూ నడిచారు. చివర్లో ప్రమాదకరమైన రోప్​వే సాయంతో సత్లెజ్​ నది దాటారు. అలా ఉదయం 11 గంటలకు మొదలైన వారి ప్రయాణం ముగిసి పోలింగ్​ స్టేషన్​కు చేరుకునే సరికి చిమ్మచీకటి కమ్ముకుంది. శనివారం హిమాచల్ ప్రదేశ్​ శాసనసభ ఎన్నికల పోలింగ్ జరగనుంది.

Last Updated : Feb 3, 2023, 8:32 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.