MLA Jeevan Reddy Ashirvada Rally : 'ఆర్మూర్​లో మళ్లీ గులాబీ జెండా ఎగరాలి.. జీవన్​రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి'

By ETV Bharat Telangana Team

Published : Aug 25, 2023, 7:33 PM IST

thumbnail

MLA Jeevan Reddy Ashirvada Rally : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి టికెట్ ప్రకటించడంతో ఆశీర్వాద ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సంక్షేమ పథకాలు అందించి.. నిత్యం ప్రజల సమస్యలు తీర్చే బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలన్నారు. ప్రజల వైపు ఉన్న పార్టీ కావాలో.. లేక ఇతర పార్టీల వైపు మొగ్గు చూపుతారో ప్రజలు తేల్చుకోవాలన్నారు. రైతులకు 3 గంటల కరెంట్ ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తారా అనేది ఒక్కసారి ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. మోటార్లకు మీటర్లు పెడతామన్న బీజేపీని దగ్గరకు తీస్తారా లేక 24 గంటల ఉచిత కరెంటును రైతులకు అందిస్తున్న ముఖ్యమంత్రిని ఆశీర్వదిస్తారా అంటూ ప్రజలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. ఆలూర్​ను మాట ఇచ్చిన విధంగా మండలం చేశామన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని రానున్న ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి 60 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.