Minister Errabelli Dayakar Rao Fires on Opposition Parties : 'కాంగ్రెస్, బీజేపీలు.. ప్రజలను మోసం చేసే పనిలో పడ్డాయి'
Published : Oct 5, 2023, 4:58 PM IST
Minister Errabelli Dayakar Rao Fires on Opposition Parties : కాంగ్రెస్ వచ్చేది లేదు.. రూ.4వేల పింఛన్ ఇచ్చేది లేదని వారి మాటలు విని మోసపోవద్దని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి.. కాంగ్రెస్, బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడా అమలు కావడం లేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో చేపట్టిన శంకుస్థాపన కార్యక్రమానికి.. పాదయాత్రగా మంత్రి ఎర్రబెల్లి బయలుదేరి వెళ్లారు. శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలను చేపట్టారు.
అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్, బీజేపీలపై విరుచుకుపడ్డారు. కేసీఆర్ పాలనలో పల్లె, పట్టణం అనే తేడా లేకుండా సమగ్ర అభివృద్ధి సాధిస్తూ ముందుకు దూసుకెళుతున్నాయని మంత్రి గుర్తు చేశారు. కాంగ్రెస్, బీజేపీలు అసత్యపు వాగ్దానాలతో ప్రజలను మోసం చేసే పనిలో పడ్డాయని.. వాళ్ల మోసాలను గ్రహించి సీఎం కేసీఆర్ పక్షాన నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలను కోరారు.