'కాంగ్రెస్ గ్యారెంటీలు నమ్మి తెలంగాణ ప్రజలు మోసపోవద్దు - కర్ణాటకలో ఆ పార్టీ దివాళా దిశగా నడుస్తోంది'

By ETV Bharat Telangana Team

Published : Nov 22, 2023, 3:26 PM IST

thumbnail

Karnataka Ex CM Yediyurappa Campaign in Telangana : తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు నమ్మి మోసపోవద్దని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని యడియూరప్ప వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన ఆయన హైదరాబాద్​లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తమ రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన 5 గ్యారెంటీలు అమలు కావడంలేదన్నారు.

BJP Election Campaign 2023 : కర్ణాటక ప్రజలను మోసం చేసిన సిద్ధరామయ్య సర్కారు దివాలా దిశగా నడుస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ 5 గ్యారెంటీలనీ అబద్దపు హామీలతో కర్ణాటక ప్రజలను మోసం చేసిందని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలోనూ ఆరు గ్యారెంటీ పథకాల పేరిట ఆ పార్టీ సరికొత్త నాటకానికి తెరలేపిందని విమర్శించారు. వాటిని నమ్మి తెలంగాణ ప్రజలు మోసపోవద్దని కోరారు.  తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.