రోటీలపై ఉమ్మువేసి తయారీ- నెట్టింట వైరల్​, రంగంలోకి పోలీసులు

By ETV Bharat Telugu Team

Published : Dec 19, 2023, 1:52 PM IST

thumbnail

Hotel Worker Spitting On Roti video viral : ఓ హోటల్​లో రోటీలపై ఉమ్మివేసి తయారుచేస్తున్న ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని ముజఫర్​నగర్​లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 2023 ప్రపంచకప్ సమయంలో ఈ హోటల్ బిర్యానిపై డిస్కౌంట్​ ఇవ్వడం వల్ల వార్తల్లోకి వచ్చింది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
ఖలాపర్ కూడిలికి సమీపంలో మక్బుల్​ తహారీ హోటల్ ఉంది. 2023 ప్రపంచకప్ సందర్భంగా బిర్యానీ కొనుగోలుపై ఈ హోటల్ కస్టమర్లకు రాయితీ ఇచ్చింది. అయితే ఈ హోటల్​లో పనిచేసే సిబ్బంది ఆహార పదార్థాలను తయారు చేస్తున్న క్రమంలో వాటిపై ఉమ్మివేస్తున్నారనేది ఆరోపణ. ఈ వ్యవహారాన్నంతటిని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల వైరల్​గా మారింది. వీడియోలో రోటీ తయారీదారు తన నోట్లోకి చెయ్యిపెట్టి దానిని రోటీపై ఏదో అంటిస్తున్నట్లుగా ఉంది. 'ఈ వీడియో సోషల్ మీడియాలో మరింత వైరల్​గా మారడం పట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం. విచారణ అనంతరం బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం' అని ముజఫర్ నగర్ ఎస్పీ సిటీ సత్యనారాయణ తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.